Sankranti Festival: సంక్రాంతికి ఆర్టీసీ 5 వేల ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Dec 28 , 2024 | 05:03 AM
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పండగ రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు.

హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు సర్వీసులు
మహిళా ప్రయాణికులకు సరిహద్దుల వరకే ఉచితం
తెలంగాణలోని జిల్లాలకూ సంక్రాంతికి ప్రత్యేక సర్వీసులు
నేడు సంక్రాంతి స్పెషల్ బస్సులపై ప్రకటన
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పండగ రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మరిన్ని సర్వీసులను పెంచాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తరలించేందుకు ఈ సంక్రాంతికి 5 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఏపీతోపాటు తెలంగాణ జిల్లాలకూ సంక్రాంతికి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం యధావిధిగా కొనసాగిస్తారు. అయితే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకే జీరో టికెట్పై ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం వర్తిస్తుంది. ఆ తర్వాత టికెట్ కొనాల్సిందే. పండగకు సంక్రాంతికి వెళ్లే వారు, పండగ తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకునే వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జనవరి మొదటి వారం నుంచి 17వ తేదీ వరకు పది రోజులు ఈ ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. సంక్రాంతి స్పెషల్ బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టీసీ అధికారులు శనివారం అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
ఏపీఎ్సఆర్టీసీ 2,400 ప్రత్యేక బస్సులు...
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి 2,400 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. జనవరి 9 నుంచి 13 వరకు సంక్రాంతి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని, వీటిని సాధారణ చార్జీలతో ఏపీలోని పలు జిల్లాలకు నడుపుతున్నట్లు ఏపీఎ్సఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్.విజయలక్ష్మి తెలిపారు. ప్రయాణికులు ఠీఠీఠీ.్చఞటట్టఛిౌుఽజూజీుఽ్ఛ.జీుఽ ద్వారా, అధీకృత ఏటీబీ ఏజెంట్ల ద్వారా అడ్వాన్సుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు.