ముంబై ఇండియన్స్లో మనోడు మెరిశాడు!
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:10 AM
కాకినాడకు చెందిన ఫాస్ట్ బౌలర్ పెన్మత్స సత్యనారాయణ రాజుకు ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కింది. ముంబై ఇండియన్స్ జట్టులో బౌలర్గా చోటు దక్కించున్నాడు.

ఐపీఎల్లో ఆడిన కాకినాడకు చెందిన సత్యనారాయణ రాజు
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
కాకినాడకు చెందిన ఫాస్ట్ బౌలర్ పెన్మత్స సత్యనారాయణ రాజుకు ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కింది. ముంబై ఇండియన్స్ జట్టులో బౌలర్గా చోటు దక్కించున్నాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో సత్యనారాయణ ఆడడంతో ఆయన కుటుంబసభ్యు లు ఆనందం వ్యక్తం చేశారు. కాకినాడలోని వారి ఇంటిలో కుటుంబసభ్యులు, బంధువు లు ఆ మ్యాచ్ను ఆసక్తిగా తిలకించారు. ఫాస్ట్ బౌలర్ అయిన సత్యనారాయణ రాజు దేశవాలీ లీగ్లో సత్తా చాటా డు. రంజీ పోటీల్లో ఎనిమిది మ్యాచ్లలో 17 వికెట్లు తీసి అందరి దృష్టి ఆకర్షించాడు. ఈ నేపథ్యంలోనే అతడు ముంబై ఇండియన్స్ జట్టుకు ఎంపికైనట్టు ఆయన తండ్రి రమేష్ తెలిపారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ వంటి పెద్ద జట్టులో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.