Share News

ఇరువురు న్యాయాధికారుల బదిలీ

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:28 PM

జిల్లా న్యాయస్థానంలో పనిచేస్తున్న ఇరువురు న్యాయాధికారులు బదిలీ అయ్యారు. ఆమేరకు సోమవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇరువురు న్యాయాధికారుల బదిలీ

వారిస్థానంలో కొత్తవారు నియామకం

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా న్యాయస్థానంలో పనిచేస్తున్న ఇరువురు న్యాయాధికారులు బదిలీ అయ్యారు. ఆమేరకు సోమవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి అదనపు న్యాయాధికారిగా ఇక్కడ పనిచేస్తున్న డి.అమ్మనరాజాను నంద్యాలకు బదిలీ చేశారు. ఆ స్థానంలో అనంతపురంలో పనిచేస్తున్న టి.రాజ్యలక్ష్మిని నియమించారు. మూడో అదనపు న్యాయాధికారిగా ఇక్కడ పనిచేస్తున్న డి.రాములును గుంటూరు ఇండస్ట్రియల్‌ ట్రైబల్‌ కం ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, లేబర్‌ కోర్టుకు బదిలీ చేవారు. ఆయన స్థానంలో మచిలీపట్నం జిల్లా కోర్టులో న్యాయాధికారిగా పనిచేస్తున్న ఎ.పూర్ణిమను నియమించారు.

Updated Date - Apr 07 , 2025 | 11:28 PM