MS Agarwal Foundries: రూ.1,200 కోట్లతో విస్తరణ
ABN , Publish Date - Apr 05 , 2025 | 04:07 AM
హైదరాబాద్కు కేంద్రంగా ఉన్న ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ (ఎంఎస్ఏఎఫ్) రూ.1,200 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 60 లక్షల టన్నుల నుంచి 1.2 కోట్ల టన్నులకు పెంచబోతున్నామని, 5,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ఎండీ ప్రమోద్ కుమార్ అగర్వాల్ తెలిపారు

ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ ఎండీ ప్రమోద్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ (ఎంఎస్ఏఎఫ్) రూ.1,200 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నాడిక్కడ మార్కెట్లోకి ఎంఎస్ లైఫ్ 600+ సీఆర్ఎస్ (కరోజన్ రెసిస్టెన్స్ స్టీల్) టీఎంటీ బార్స్ను కంపెనీ ఎండీ ప్రమోద్ కుమార్ అగర్వాల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అగర్వాల్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కంపెనీకి చెందిన ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వచ్చే 2-3 ఏళ్ల కాలంలో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీకి తెలంగాణలోని తూప్రాన్, ఏపీలోని నాయుడుపేట, మంత్రాలయంలో ప్లాంట్లున్నాయి. ఈ ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 60 లక్షల టన్నులుండగా ప్రతిపాదిత పెట్టుబడులతో 1.2 కోట్ల టన్నులకు చేరుకుంటుందని అగర్వాల్ తెలిపారు. అలాగే ఈ విస్తరణ ద్వారా 5,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్లో పర్సనల్ లోన్స్పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News