Share News

మహనీయుల జయంతి వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు..

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:22 AM

జిల్లాలో మహనీయుల జయంతి వేడుకల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అధికారులను అదేశించారు.

మహనీయుల జయంతి వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు..

సిరిసిల్ల కలెక్టరేట్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మహనీయుల జయంతి వేడుకల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అధికారులను అదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం మహనీయుల జయంతి వేడుకల నిర్వహణపై అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా కలె క్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో ఏప్రిల్‌ 5న బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి తోపాటు 14న డాక్టర్‌ బీఅర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలను ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో మహనీయుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. జయంతి వేడుకలకు అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రభుత్వం నుంచి వేడుకలకు సంపూర్ణ ఏర్పాట్లు చేస్తామని అన్నారు. గ్రామ పంచాయితీ నిఽధుల నుంచి గ్రామాల్లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహాల వద్ద అలంకరణలు, పూలమాలలు వేయడం వంటి పనులు చేయాలని సూచించారు. వేములవాడలో అంబేద్కర్‌ కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం రూ.16లక్షల నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచామని కలెక్టర్‌ ప్రకటించారు. అంబేద్కర్‌ జయంతి, బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల సందర్భంగా సాధారణ ప్రజల రవాణాకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా రోడ్‌ల బ్లాక్‌లు చేయాలని ప్రజలకు వాహనదా రులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశం లో డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జి వేల్ఫేర్‌ అధికారి రాజామనోహార్‌, ఎస్సీ కార్పొరే షన్‌ ఈడీ స్వప్న, ఏఎస్‌డబ్య్లూవో విజయలక్ష్మీ, నాయకులు రాగుల రాములు, బో లుమాల శంకర్‌, జక్కుల యాదగిరి, గుంటి వేణు, ఎరవెళ్లి నాగరాజు, అంకని భా ను, ఖానాపురం లక్ష్మణ్‌, బడె స్వామిదాస్‌ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 12:22 AM