రిజర్వేషన్ల పెంపు నిర్ణయం చారిత్రాత్మకం
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:22 PM
తె లంగాణ శాసనసభలో బీసీ, ఎస్సీల రిజర్వేషన్లు పెంచుతూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదం చేయ డం చారిత్రాత్మకమని గద్వాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి అన్నారు.

గద్వాలలో బాణసంచా కాల్చిన కాంగ్రెస్ నాయకులు
గద్వాల టౌన్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): తె లంగాణ శాసనసభలో బీసీ, ఎస్సీల రిజర్వేషన్లు పెంచుతూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదం చేయ డం చారిత్రాత్మకమని గద్వాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి అన్నారు. రిజర్వేష న్ల పెంపుపై సాహసోపేత నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈవిషయంలో సహకరించిన అన్ని పార్టీలకు, ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని పాతబ స్టాండ్ సర్కిల్లో బాణసంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు మురళి, కృష్ణ, నాయకులు వెంకటేష్, ఆంజనే యులు, ధర్మనాయుడు, కురుమ న్న, గోవిందు, సుధాకర్, మధు, రమేష్, రంజిత్, పరశురాముడు ఉన్నారు.