Share News

మహిళల అభివృద్ధి కోసమే పెరటి కోళ్ల పంపిణీ

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:00 AM

రాజాపేట, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అభివృద్ధి కోసం పెరటి కోళ్లను పంపిణీ చేస్తున్నట్లు జాతీయ మాంస పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బస్వారెడ్డి అన్నారు.

మహిళల అభివృద్ధి కోసమే పెరటి కోళ్ల పంపిణీ

రాజాపేట, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అభివృద్ధి కోసం పెరటి కోళ్లను పంపిణీ చేస్తున్నట్లు జాతీయ మాంస పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బస్వారెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నెమిల గ్రామం లో పశుసంవర్థకశాఖ మాంస పరి శోధన సంస్థ ఆధ్వ ర్యంలో మహిళలకు పెరటికోళ్లను అందజేశారు. అనంతరం వారు మాటా ్లడుతూ, మహిళలు పెరటి కోళ్ల పెంపకం చేపట్టి ఆర్థికంగా ఎదగాలని కోరారు. గ్రామంలో 63 మందికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ జానయ్య, మండల పశు వైద్యాఽధికారి డాక్టర్‌ చంద్రరెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ చిలివేరు బాలరాజు పశువైద్య సిబ్బంది అశోక్‌, శ్రీకాంత పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 12:01 AM