పంజాబ్ శంభు సరిహద్దులో ఉద్రిక్తత..

ABN, Publish Date - Mar 20 , 2025 | 11:30 AM

బుధవారం రాత్రి రైతుల నిరశనలు భగ్నం చేసిన పోలీసులు.. గురువారం ఉదయం నుంచి నిరసన స్థలాలను ధ్వంసం చేస్తున్నారు. రాత్రి కేంద్ర ప్రతినిధి బృందంతో సమావేశం ముగించుకుని తిరిగి వస్తున్న రైతు నాయకులను హరియాణ పోలీసులు అడ్డుకున్నారు. రైతులు దీక్షను భగ్నం చేశారు. అన్నదాతలను అరెస్ట్ చేశారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

హరియాణ (Haryana), పంజాబ్ (Punjab) శంభు సరిహద్దులో (Shambhu Border) ఉద్రిక్తత (Tension) పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి రైతుల నిరశనలు భగ్నం చేసిన పోలీసులు.. గురువారం ఉదయం నుంచి నిరసన స్థలాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శంభు సరిహద్దు వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. శంభు సరిహద్దు వద్ద వివిధ డిమాండ్లతో కేంద్రానికి వ్యతిరేకంగా అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నారు. ఏడాది నుంచి శంభు-ఖనౌరి సరిహద్దు మూసివేసి నిరసనలు తెలియజేస్తున్నారు.

Also Read..:

దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..


బుధవారం రాత్రి కేంద్ర ప్రతినిధి బృందంతో సమావేశం ముగించుకుని తిరిగి వస్తున్న రైతు నాయకులను హరియాణ పోలీసులు అడ్డుకున్నారు. రైతుల దీక్షను భగ్నం చేశారు. అన్నదాతలను అరెస్ట్ చేశారు. నిరసన తెలుపుతున్న ప్రాంతం నుంచి రైతులను ఖాళీ చేయించారు. కాంక్రీట్ బారికేడ్లను బుల్డోజర్లతో తొలగించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పాడ్డాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...

ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం..

కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటన

For More AP News and Telugu News

Updated at - Mar 20 , 2025 | 11:30 AM




News Hub