Home » Crop Loan Waiver
రాష్ట్రంలో రైతు రుణాల మాఫీకి రంగం సిద్ధమైంది. గురువారం సాయంత్రం 4గంటలకు ముహూర్తం ఖరారైంది. తొలి విడతలో రూ.లక్ష లోపు రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయనుంది.
అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. గతంలో చెప్పినట్లుగానే నిర్ణీత వ్యవధిలో తీసుకున్న అప్పు, వడ్డీ మొత్తం కలిపి కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కేసులను తక్షణమే సీబీఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విద్యుత్తు కొనుగోలు అంశంలో జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తును వేగవంతం చేయాలని పేర్కొంది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 33 ఎకరాల వ్యవసాయేతర భూమికి రైతుబంధు సాయం దక్కింది! ఒక సీజన్లో కాదు.. ఏకంగా ఐదేళ్లు! దీనిపై ఫిర్యాదు రావడంతో ఆ సొమ్ము రికవరీకి ఆ జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
రుణమాఫీ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆదాయపు పన్ను చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘‘ఆరు నూరైనా.. పంద్రాగస్టులోగా రూ.2 లక్షల్లోపు రుణమాఫీ చేసి తీరుతా..!’’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శపథం చేసిన మేరకు.. అధికారులు ఆ దిశలో విధివిధానాలపై కసరత్తు ముమ్మరం చేశారు. నేడోరేపో మార్గదర్శకాలను వివరించే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి.
రైతు రుణ మాఫీ, రైతు భరోసా పథకాల కోసం ప్రభుత్వం రకరకాలుగా నిధుల వేటను సాగిస్తోంది. ప్రభుత్వ భూములను హామీగా పెట్టి ప్రైవేటు ఆర్థిక సంస్థల నుంచి బాండ్ల ద్వారా నిధులను సేకరించడం, ఏడాది పొడవునా తీసుకొనే బడ్జెట్ అప్పులను ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వంటి ప్రయత్నాలు చేస్తోంది.
రైతు భరోసా అంశంలో బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే మతి భ్రమించి మాట్లాడుతున్నారని అనిపిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు బంధు అమలులో అనుసరించిన విధానాల వల్ల గత ప్రభుత్వం రూ.26,500 కోట్ల ప్రజాధనం దుబారా చేసిందని ఆరోపించారు.
రైతు సంక్షేమ పథకాలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.64 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని వ్యవసాయశాఖ ప్రతిపాదనలు తయారు చేసింది.
రుణ మాఫీ పథకం అమలుకు జూలై ఒకటో తేదీ నుంచే సర్కారు శ్రీకారం చుట్టనుంది. ఆగస్టు 15వ తేదీలోపు ప్రక్రియ మొత్తం పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు నిధులు సమీకరించాలని ఆర్థిక శాఖకు కూడా ఆదేశాలు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.