ప్రపంచస్థాయి ఆధ్మాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరీశుడి ఆలయాన్ని మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్జ్కోవా మంగళవారం దర్శించుకున్నారు. తిరువీధుల్లో అఖండ దీపారాధన చేసి కొబ్బరికాయ సమర్పించి సనాతన హిందూ ధర్మం, ఆలయ విశిష్టత, సంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు.
అమ్మకు పిల్లలే మొదటి ప్రాధాన్యం. వారి ఆలనాపాలనలోనే పెరుగుతారు. కానీ మా అమ్మకు సమాజంలోని ప్రతీ వర్గం సమానం. వారి కష్టాలను తీర్చడమే ఆమె లక్ష్యంగా పనిచేసేవారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తాగునీరు, పన్ను వసూళ్లు, ఎల్ఆర్ఎ్సపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి గుట్టలపై ఆది మానవుల ఆవాసాలు గుర్తించామని చారిత్రక పరిశోధకుడు, జనగామ జిల్లాకు చెందిన రెడ్డి రత్నాకర్రెడ్డి (డిస్కవరీ మ్యాన) తెలిపారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో సోమవారం హత్యకు గురైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మెంచు చక్రయ్యగౌడ్ అంత్యక్రియలు మంగళవారం అశ్రునయనాల మధ్య గ్రామంలో జరిగాయి.
అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టే 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్పై ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టే ఈ బడ్జెట్లో ఉమ్మడి జిల్లా ఆకాంక్షలకు అనుగుణంగా నిధుల కేటాయింపులు ఉంటాయని అంతా భావిస్తున్నారు.
ఎన్నో చారిత్రక, పురాణ, రాజవంశాల పాలన ఆనవాళ్లతో పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఉమ్మడి జిల్లా మరింత పర్యాటక శోభను సంతరించుకోనుంది. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకానికి పెరుగుతున్న ప్రాధాన్యం నేపథ్యంలో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జిల్లాపై దృష్టిసారించాయి.
తెలంగాణ శాసన మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి యాదగిరిగుట్ట అభివృద్ధి గురించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయానికి అద్భుతమైన పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు.
పట్టణ ప్రజల సామూహిక అవసరాలు, స్థానికుల ఆర్థిక స్థిరత్వం లక్ష్యంగా కోట్ల రూపాయల వ్యయంతో దశాబ్దం క్రితం భువనగిరి మునిసిపల్ పరిధిలో నిర్మించిన కమ్యూనిటీ భవనం నిరుపయోగంగా ఉంది.
జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నానని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఆదివారం తుంగతుర్తిలో ఎమ్మె ల్యే మందుల సామేలు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.