Share News

Tirupati: బొజ్జల సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ABN , First Publish Date - 2023-10-29T09:06:41+05:30 IST

తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు మరో 26 మందిపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

Tirupati: బొజ్జల సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు మరో 26 మందిపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. జగనాసుర దహనం ఎక్కడో మారుమూర పల్లెలో చేస్తుంటే సిఐ అజయ్ కుమార్ అడ్డుకుని నిర్వహిస్తున్న వారిని బూతులు తిట్టారు. ఇళ్ల వద్దకు వెళ్లి బూతులు తిట్టడం ఎంత వరకు సమంజమని శనివారం మధ్యాహ్నం సిఐని బొజ్జల సుధీర్ రెడ్డి టెలిఫోన్లో ప్రశ్నించారు. దీంతో పోలీస్ స్టేషన్‌కు వస్తే తేల్చుకుందామని సీఐ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పీఎస్ ముందు సుధీర్ రెడ్డి, ఆయన అనుచరులు ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్టేషన్‌కు వచ్చి వారికి సర్ది చెప్పడంతో సిఐపై బొజ్జల సుధీర్ ఫిర్యాదు చేశారు. దీంతో సీఐపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, అర్ధ రాత్రి బొజ్జలతో పాటు 26 మందిపై పోలీసులు అట్రాసిటీ కేసు పెట్టారు.

Updated Date - 2023-10-29T09:06:41+05:30 IST