Merugu Nagarjuna: చంద్రబాబుపై మంత్రి నాగార్జున విమర్శలు

ABN , First Publish Date - 2023-05-25T18:02:48+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున విమర్శలు గుప్పించారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా పేదలకు అమరావతిలో

 Merugu Nagarjuna: చంద్రబాబుపై మంత్రి నాగార్జున విమర్శలు
Merugu Nagarjuna

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున (Merugu Nagarjuna) విమర్శలు గుప్పించారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా పేదలకు అమరావతిలో పట్టాలు ఇచ్చి తిరుతాం. చంద్రబాబు(Chandrababu)కు రాష్ట్ర ప్రజలను మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య. చంద్రబాబు ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయ్యారు. పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని చంద్రబాబు అంటున్నారు. రాజధానిలో పేదలు ఉండకూడదని ఉద్యమాలు, ధర్నాలు చేయిస్తున్నారు. ఇళ్ల పట్టాలపై కోర్టులు చంద్రబాబుకి మొట్టికాయలు వేసింది. రాజధాని ప్రాంత ప్రజలు చంద్రబాబుని నమ్మి మోసపోయారు.’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-05-25T18:02:48+05:30 IST