Meruga Nagarjuna: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే

ABN , First Publish Date - 2023-01-07T15:01:19+05:30 IST

బహిరంగ సభలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నరమేధం సృష్టిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున విమర్శలు గుప్పించారు.

Meruga Nagarjuna: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే

అమరావతి: బహిరంగ సభలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) రాష్ట్రంలో నరమేధం సృష్టిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున (Social Welfare Minister Merugu Nagarjuna) విమర్శలు గుప్పించారు. శనివారం నరసాపురంలో ‘‘గడపగడపకు మన ప్రభుత్వం’’ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మేరుగు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే అని అన్నారు. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టిన అవినీతిపరుడు చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేక చంద్రబాబు అసెంబ్లీకి దూరమయ్యారన్నారు. రాజకీయ వ్యవస్థలో ప్రజా అవసరాలను తీర్చిన ఘనత సీఎం జగన్ (AP CM Jagan Mohan Reddy) దే అని మంత్రి మేరుగా నాగార్జున అన్నారు.

Updated Date - 2023-01-07T15:01:20+05:30 IST