Share News

Chandrababu: రెండు రోజులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

ABN , First Publish Date - 2023-12-07T11:31:58+05:30 IST

Andhrapradesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రేపటి (శుక్రవారం) నుంచి రెండు రోజుల పాటు బాబు పర్యటన కొనసాగనుంది.

Chandrababu: రెండు రోజులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) పర్యటించనున్నారు. రేపటి (శుక్రవారం) నుంచి రెండు రోజుల పాటు బాబు పర్యటన కొనసాగనుంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ అధినేత పర్యటించనున్నారు. రేపు వేమూరు, తెనాలి, బాపట్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్న చంద్రబాబు రాత్రికి బాపట్లలోనే బస చేయనున్నారు. శనివారం పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో బాబు పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా తుపాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడంతో పాటు రైతులను నేరుగా కలుసుకోనున్నారు. రైతులను పరామర్శించి వారికి చంద్రబాబు ధైర్యం చెప్పనున్నారు.

Updated Date - 2023-12-07T11:31:59+05:30 IST