Ayyanna Patrudu: ఉత్తరాంధ్రులు జగన్‌ను ఛీ కొట్టారు

ABN , First Publish Date - 2023-03-17T16:21:01+05:30 IST

ఉత్తరాంధ్రులు జగన్‌ (CM JAGAN) ను ఛీ కొట్టారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల

Ayyanna Patrudu: ఉత్తరాంధ్రులు జగన్‌ను ఛీ కొట్టారు
Ayyanna Patrudu

విశాఖ: ఉత్తరాంధ్రులు జగన్‌ (CM JAGAN) ను ఛీ కొట్టారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC election) తెలుగు దేశం దూసుకెళ్తోందని తెలిపారు. ఏ రౌండ్‌లోనూ కనీసం వైసీపీ (YCP) పోటీ ఇవ్వలేదని పేర్కొన్నారు. నాలుగో రౌండ్ అయ్యే సరికి 20 వేల ఆధిక్యంలో టీడీపీ (TDP) ఉందని స్పష్టం చేశారు. జగన్‌ని ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసించలేదన్నారు. ఇక రాజధాని కబుర్లు నమ్మలేదని చెప్పుకొచ్చారు. రాజధాని పేరుతో జగన్ విశాఖలో చేసిన విధ్వంసం, అలాగే ఈ 4 ఏళ్ల చీకటి పాలనను ప్రజలు గుర్తు చేసుకున్నారని వెల్లడించారు. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే కాపాడగలరని ఓటర్లు గుర్తించారని తెలిపారు. అందుకే ఈ వన్ సైడ్ ఫలితాలు వచ్చాయని స్పష్టం చేశారు. వైసీపీ అంతానికి ఆరంభం ఇదేనని.. సైకో పోవాలి - సైకిల్ రావాలి అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు. ఈమేరకు #ByeByeJaganIn2024 ట్యాగ్‌లైన్‌ జతచేశారు.

Updated Date - 2023-03-17T16:21:01+05:30 IST