రాష్ట్రం బాగు పడాలంటే బాబు సీఎం కావాలి
ABN , First Publish Date - 2023-05-08T01:21:33+05:30 IST
రాష్ట్రం బాగు పడాలంటే చంద్రబాబునాయుడు అధికారంలోకి రావాలని టీడీపీ మండల అధ్యక్షుడు కాయల మురళీ అన్నారు.

కశింకోట, మే 7 : రాష్ట్రం బాగు పడాలంటే చంద్రబాబునాయుడు అధికారంలోకి రావాలని టీడీపీ మండల అధ్యక్షుడు కాయల మురళీ అన్నారు. ఆదివారం రామన్నపాలెంలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి వైసీపీ నిరంకుశ పాలనపై కరపత్రాలను పంపిణీ చేశారు. వైసీపీ నిరంకుశ పాలన నుంచి ప్రజలను బయటపడాలంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉగ్గిన రమణమూర్తి, మాజీసర్పంచ్ సిద్దిరెడ్డి శ్రీను, ముచ్చు కొండలరావు, గొల్లపల్లి ప్రవీణ్, అప్పలనాయుడు, కలగ నాయుడు, చలపతిరావు పాల్గొన్నారు.