Swiggy: వినియోగదారులపై స్విగ్గీ భారం...రూ.2 ప్లాట్‌ఫాం ఫీజు వసూలు

ABN , First Publish Date - 2023-04-29T07:44:33+05:30 IST

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం అయిన స్విగ్గీ వినియోగదారులపై అదనపు భారం వడ్డిస్తోంది...

Swiggy: వినియోగదారులపై స్విగ్గీ భారం...రూ.2 ప్లాట్‌ఫాం ఫీజు వసూలు
Swiggy begins charging

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం అయిన స్విగ్గీ వినియోగదారులపై అదనపు భారం వడ్డిస్తోంది.(Swiggy begins charging) ఫుడ్ ఆర్డర్(food order) చేసిన వినియోగదారు ఒక్కొక్కరి నుంచి రెండు రూపాయల ప్లాట్‌ఫారమ్ ఫీజు(platform fee) వసూలు చేయడం ప్రారంభించింది. ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లోని ఫుడ్ ఆర్డర్‌లపై మాత్రమే అదనపు ఛార్జీలు విధిస్తున్నామని, ఇన్‌స్టామార్ట్ వినియోగదారులకు ఇది వర్తించదని కంపెనీ తెలిపింది.ప్లాట్‌ఫారమ్ ఫీజు అనేది ఫుడ్ ఆర్డర్‌లపై వసూలు చేసే నామమాత్రపు ఫ్లాట్ ఫీజు అని స్విగ్గీ పేర్కొంది.

ఇది కూడా చదవండి : Hyderabad City: హైదరాబాద్ నగరంలో భారీవర్షం...రోడ్లు జలమయం

ఈ రుసుము తమ ప్లాట్‌ఫారమ్‌ను ఆపరేట్ చేయడానికి, మెరుగుపరచడానికి, యాప్ ఫీచర్‌లను మెరుగుపరచడంలో తమకు సహాయపడుతుందని స్విగ్గీ (Swiggy) ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.స్విగ్గీ ఒక రోజులో 1.5-2 మిలియన్ ఆర్డర్‌లను ప్రాసెస్ చేసినట్లు పేర్కొంది.హైదరాబాద్‌లోని ప్రజలు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీలో 10 లక్షల బిర్యానీలు 4 లక్షల ప్లేట్ల హలీమ్‌లను ఆర్డర్ చేశారు.

Updated Date - 2023-04-29T08:17:28+05:30 IST