NTR: బహ్రెయిన్‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుక

ABN , First Publish Date - 2023-05-28T07:17:09+05:30 IST

బహ్రెయిన్‌లో శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ శత జయంతి వేడుక కన్నుల పండువగా జరిగింది.

NTR: బహ్రెయిన్‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుక

ఆంధ్ర జ్యోతి గల్ఫ్ ప్రతినిధి: బహ్రెయిన్‌లో శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ శత జయంతి వేడుక కన్నుల పండువగా జరిగింది. ఎన్టీఆర్ అభిమానులు తెలుగు దేశం శ్రేణులు ఘనంగా ఒక పండగ వాతావరణములో ఈ వేడుకను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి స్వదేశం నుండి ముఖ్య అతిథులుగా నారా రోహిత్, గుమ్మడి గోపాల కృష్ణ విచ్చేశారు.

TT.jpg

తెలుగు దేశం బహ్రెయిన్ అధ్యక్షులు రఘునాధ్ బాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగు జాతికి గర్వకారణమైన ఒక మహాపురుషుడు అని అన్నారు. తర తరాలను తన్మయం చేయగల కారణజన్ముడు, చిరస్మరణీయుడు అని కొనియాడారు. అలాగే నారా రోహిత్, గుమ్మడి గోపాల కృష్ణ మాట్లాడుతూ, తెలుగు దేశాన్ని గెలిపించవలసిన బాధ్యత మనపై ఉందని, మనం అందరం కలిసి సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.

T.jpg

ప్రవాసీ ప్రముఖులు శివ కుమార్, హరిబాబు, మురళీకృష్ణ, రాజశేఖర్, గోపాల్ చౌదరి, ఇతర వక్తలు ఎన్టీఆర్‌ను, ఆయన తెలుగు జాతికి అందించిన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్‌ని ఒక గొప్ప నాయకుడిగా, గొప్ప కళాకారుడిగా తెలుగు వారి ఆరాధ్య దైవంగా తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక మహాపురుషుడిగా వర్ణించారు.

TTTTT.jpg

కార్యక్రం ఆద్యంతం ఆట పాటలతో ఒక్కో పాత్ర సభికులు ఉత్సాహ పరిచింది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలో ప్రవాసాంధ్రులు దాదాపు ఐదు వందల మందికి పైగా పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

TTTTTT.jpg

Updated Date - 2023-05-28T07:17:09+05:30 IST