Share News

Pallavi Prashant: ఏబీఎన్‌ చేతిలో బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ రిమాండ్ రిపోర్ట్

ABN , Publish Date - Dec 21 , 2023 | 02:58 PM

Telangana: అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో బిగ్‌ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్, ఆయన సోదరుడిని గత రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.

Pallavi Prashant: ఏబీఎన్‌ చేతిలో బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ రిమాండ్ రిపోర్ట్

హైదరాబాద్: అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో బిగ్‌ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను (Bigg Boss Winner Pallavi Prashant) జూబ్లీహిల్స్ పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్, ఆయన సోదరుడిని గత రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ చంచల్‌ గూడ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంతి రిమాండ్ రిపోర్టు ఏబీఎన్ (ABN-Andhrajyothy) చేతికి చిక్కింది. విధుల్లో ఉన్న పోలీసులకు పల్లవి ప్రశాంత్ ఆటంకం కలిగించారని రిమాండ్ రిపోర్టులో ఉంది.

‘‘పల్లవి ప్రశాంత్ కారణంగా పలువురు యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. పోలీసుల ముందే వీరు ఆరు ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారు. పోలీసులను డ్యూటీ చేయకుండా పల్లవి ప్రశాంత్ అడ్డుకున్నారు. న్యూసెన్స్ మొత్తం పోలీసుల కళ్ళముందరే జరిగింది. వీరిని అరెస్టు చేయకుంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారు. భవిష్యత్తులో వీరికి సమాజంపై బాధ్యత భయము ఉండాలని ఉద్దేశంతోనే అరెస్టు చేశాము. సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం కూడా ఉన్న కారణంగా పల్లవి ప్రశాంతను అదుపులోకి తీసుకున్నాం. పోలీసులు పలుమార్లు పల్లవి ప్రశాంత్‌కు విజ్ఞప్తి చేసినా కనికరించలేదు. పల్లవి ప్రశాంత్ అతడి అనుచరులను రెచ్చగొట్టి కార్లు, బస్సులు ధ్వంసం కు పాల్పడ్డారు. రెండు కార్లను రెంట్‌కు తీసుకుని అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు వచ్చారు. అక్కడికి వచ్చిన వారందరినీ విధ్వంసానికి ఉసిగొల్పారు. బిగ్ బాస్ షోకు వచ్చిన సెలబ్రిటీ కార్లను ధ్వంసం చేశారు. వీరికి 41 సీఆర్పీసీ నోటీస్ ఇచ్చేకే అరెస్ట్ చేసాము’’ అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 21 , 2023 | 04:25 PM