Share News

Sangareddy Dist.: తండ్రి బీజేపీ.. తనయుడు బీఆర్‌ఎస్..

ABN , First Publish Date - 2023-11-19T11:54:43+05:30 IST

సంగారెడ్డి జిల్లా: ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్‌కు ఆయన కుమారుడు ఉదయ్ బాబు మోహన్ ఊహించని షాక్ ఇచ్చాడు. ఆదివారం సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఉదయ్ బీఆర్ఎస్‌లో చేరారు.

Sangareddy Dist.: తండ్రి బీజేపీ.. తనయుడు బీఆర్‌ఎస్..

సంగారెడ్డి జిల్లా: ఆందోల్ బీజేపీ అభ్యర్థి (BJP Leader), మాజీ మంత్రి (Ex Minister) బాబు మోహన్‌ (Babu Mohan)కు ఆయన కుమారుడు ఉదయ్ బాబు మోహన్ (Uday Babu Mohan) ఊహించని షాక్ (Shock) ఇచ్చాడు. ఆదివారం సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) సమక్షంలో ఉదయ్ బీఆర్ఎస్‌ (BRS)లో చేరారు. ఆయనతోపాటు ఆందోల్, జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, చౌటకుర్ మండల ప్రెసిడెంట్ శేఖర్, ఇతర బీజేపీ నాయకులు (BJP Leaders) బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ వైపు నిలబడాలని, పార్టీ గెలుపు కోసం అందరం కలిసి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కాగా అందోల్ బీజేపీ టికెట్ ఆశించి ఉదయ్ బాబూమోహన్ భంగపడ్డారు. దీంతో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకుని పార్టీ మారారు.

Updated Date - 2023-11-19T11:54:46+05:30 IST