Congress: దళిత గిరిజనులను మోసగిస్తున్న బీఆర్ఎస్: రామ్మోహన్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-08-23T16:10:05+05:30 IST

ఎన్నికలొచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) ఆచరణ సాధ్యం కాని హమీలిచ్చి దళిత గిరిజనులను మోసం చేస్తోందని పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి(Rammohan Reddy ) విమర్శిచారు.

 Congress: దళిత గిరిజనులను మోసగిస్తున్న బీఆర్ఎస్:  రామ్మోహన్‌రెడ్డి

వికారాబాద్ జిల్లా(పరిగి): ఎన్నికలొచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) ఆచరణ సాధ్యం కాని హమీలిచ్చి దళిత గిరిజనులను మోసం చేస్తోందని పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి(Rammohan Reddy ) విమర్శిచారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 26న చేవెళ్ల(Chevella)లో జరిగే కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పలువురు జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు సభకు హాజరవుతారని చెప్పారు. సభ ద్వారా కాంగ్రెస్ దళిత గిరిజనులకు ఏం చేసింది... మున్ముందు ఏం చేయబోతోంది వివరిస్తామన్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించి కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు 24వ తేదీన రేవంత్‌రెడ్డి పరిగి వస్తారని రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-08-23T16:10:05+05:30 IST