Share News

MLA KALAVA: నగరవనానికి పూర్వ వైభవం తెస్తాం

ABN , Publish Date - Jun 30 , 2024 | 12:17 AM

వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన నగరవనాన్ని అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆయన నగరవనాన్ని సందర్శించారు.

MLA KALAVA: నగరవనానికి పూర్వ వైభవం తెస్తాం
MLA Kalava Srinivasulu is watering the plants in Nagaravanam

రాయదుర్గం, జూన 29: వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన నగరవనాన్ని అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆయన నగరవనాన్ని సందర్శించారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు నాటారు. అక్కడ ఉన్న బొమ్మలను, చెట్లను పరిశీలించారు. అటవీశాఖ అధికారి దామోదర్‌రెడ్డితో నగరవనానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టణ ప్రజల ఆనందం, ఉల్లాసం కోసం ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడానికి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రత్యేక చొరవతో పట్టణ శివారులో నగరవనాన్ని ప్రారంభించామన్నారు. గడిచిన ఐదేళ్లలో తీవ్రమైన నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి నోచుకోకుండా పోయిందన్నారు. నగరవనాన్ని రాయదుర్గం ప్రజలకు కానుకగా అందిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Jun 30 , 2024 | 12:17 AM