ఓటు వేసిన డీఐజీ విజయరావు
ABN , Publish Date - May 14 , 2024 | 12:51 AM
స్థానిక బీ. క్యాంపులోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సోమవారం కర్నూలు రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు తన సతీమణితో కలిసి ఓటు వేశారు.

కర్నూలు మే 13: స్థానిక బీ. క్యాంపులోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సోమవారం కర్నూలు రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు తన సతీమణితో కలిసి ఓటు వేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్, ఎస్పీలు
కర్నూలు(కలెక్టరేట్),: నగరంలో సోమవారం ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన, సిల్వర్ జూబ్లీ కళాశాల పోలింగ్ కేంద్రంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే స్థానిక కొత్తపేటలోని సెయింట్ జోసెఫ్ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.