Share News

Sri Kesh Balaji: ఎన్నికల అనంతరం పల్నాడు జిల్లాలో పరిస్థితులపై స్పందించిన జిల్లా కలెక్టర్

ABN , Publish Date - May 20 , 2024 | 11:48 AM

ఎన్నికల తర్వాత పల్నాడు జిల్లాలో పరిస్థితులపై ఆ జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ బాలాజీ స్పందించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జిల్లాలో అన్ని కేంద్రాలలో పోలింగ్ బాగా జరిగిందన్నారు. అక్కడక్కడా కొన్ని చోట్ల అల్లర్లు జరగటం బాధాకరమన్నారు.

Sri Kesh Balaji: ఎన్నికల అనంతరం పల్నాడు జిల్లాలో పరిస్థితులపై స్పందించిన జిల్లా కలెక్టర్

పల్నాడు: ఎన్నికల తర్వాత పల్నాడు జిల్లాలో పరిస్థితులపై ఆ జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ బాలాజీ స్పందించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జిల్లాలో అన్ని కేంద్రాలలో పోలింగ్ బాగా జరిగిందన్నారు. అక్కడక్కడా కొన్ని చోట్ల అల్లర్లు జరగటం బాధాకరమన్నారు. కనీసం కౌంటింగ్ కేంద్రం వద్ద అయినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

Vallabhaneni Vamsi: గన్నవరంలో మాయమై డల్లాస్‌లో వల్లభనేని వంశీ ప్రత్యక్షం.. ఎందుకా అని ఆరాతీస్తే..?


గతంలో కేసుల్లో ఉన్న వ్యక్తులు మొన్న జరిగిన అల్లర్లలో వారి పాత్ర ఉంటే వారి పట్ల మరింత కఠినంగా వ్యవరిస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి ఇచ్చే అనుమతి పత్రాలను రెండు మూడు రోజుల్లో వారికి అందజేస్తామని పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ బాలాజీ తెలిపారు. శాంతి భద్రతల సమస్య రాకుండా ఉండాలనే జిల్లాలో144 సెక్షన్ అమలు చేస్తున్నామని వెల్లడించారు. 144 వలన కొంత ఇబ్బంది ఉన్నా సాధారణ ప్రజలు సహకరించాలని శ్రీకేష్ బాలాజీ కోరారు.

ఇవి కూడా చదవండి....

Loksabha Polls: 8 సార్లు ఓటేసి, వీడియో తీసి.. ఏం జరిగిందంటే..?

IPL 2024: ఐపీఎల్ ప్లే ఆప్స్ షెడ్యూల్ ఇదే..!!

Read Latest AP News AND Telugu News

Updated Date - May 20 , 2024 | 11:48 AM