Share News

YCP: ఏలూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి

ABN , Publish Date - May 15 , 2024 | 07:30 AM

ఏలూరు: నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకం సృష్టించారు. 40వ డివిజన్‌లో టీడీపీ వర్గీయులపై దాడి చేశారు. తెలుగుదేశం సానుభూతి పరుడు చీపుర్లు గణేష్‌పై కోడి కత్తితో వైసీపీ దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో గణేష్ గొంతు వద్ద తీవ్ర గాయమైంది.

YCP: ఏలూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి

ఏలూరు: నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నాయకులు అరాచకం సృష్టించారు. 40వ డివిజన్‌లో టీడీపీ (TDP) వర్గీయులపై దాడి చేశారు. తెలుగుదేశం సానుభూతి పరుడు చీపుర్లు గణేష్‌ (Ganesh)పై కోడి కత్తితో వైసీపీ దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో గణేష్ గొంతు వద్ద తీవ్ర గాయమైంది. దీంతో టీడీపీ శ్రేణులు ఏలూరు ఆసుపత్రికి తరలించారు. 40 వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ (YCP Corporator) తుమ్మరాడ స్రవంతి తన అనుచరులతో దాడి చేయించిందని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. సోమవారం జరిగిన పార్లమెంట్ (Parliament), అసెంబ్లీ (Assembly) ఎన్నికలలో (Elections 2024) తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకు ఆమె దాడి చేయించిందని ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న టీడీపీ, వైసీపీ వర్గాలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంలో పోలీసులు (Police) ఆస్పత్రి వద్దకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

మోదీ ఆస్తి రూ.3.2 కోట్లు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 15 , 2024 | 07:31 AM