Share News

YCP: శ్రీకాళహస్తిలో వైసీపీ బరితెగింపు

ABN , Publish Date - Feb 07 , 2024 | 01:38 PM

శ్రీకాళహస్తిలో వైసీపీ బరితెగింపు చర్చనీయాంశంగా మారింది. పంచాయతీరాజ్ అతిథి గృహంలో ప్రభుత్వ వలంటీర్లకు వైసీపీ నేతలతో రాజకీయ పాఠాలు చెప్పిస్తోంది. శ్రీకాళహస్తి పట్టణంలోని సినిమా వీధి, దోబీ ఘాట్, పెద్ద మసీదు వీధి, ఎం.ఎం వాడా, తెలుగుగంగ కాలనీ, జయరాం రావు వీధులకు చెందిన తొమ్మిది మంది వలంటీర్లకు శిక్షణ ఇప్పిస్తోంది.

YCP: శ్రీకాళహస్తిలో వైసీపీ బరితెగింపు

తిరుపతి: శ్రీకాళహస్తిలో వైసీపీ బరితెగింపు చర్చనీయాంశంగా మారింది. పంచాయతీరాజ్ అతిథి గృహంలో ప్రభుత్వ వలంటీర్లకు వైసీపీ నేతలతో రాజకీయ పాఠాలు చెప్పిస్తోంది. శ్రీకాళహస్తి పట్టణంలోని సినిమా వీధి, దోబీ ఘాట్, పెద్ద మసీదు వీధి, ఎం.ఎం వాడా, తెలుగుగంగ కాలనీ, జయరాం రావు వీధులకు చెందిన తొమ్మిది మంది వలంటీర్లకు శిక్షణ ఇప్పిస్తోంది. శ్రీకాళహస్తి టౌన్‌లో 35 వార్డుల సచివాలయ సిబ్బందికి ఎప్పుడూ మున్సిపల్ కార్యాలయంలోనే అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సారి అందుకు భిన్నంగా వైసీపీ ప్రవర్తిస్తోంది. అందర్నీ పిలిస్తే విషయం బయటకు తెలుస్తుందని గుట్టు చప్పుడు కాకుండా కొన్ని వార్డులకు మాత్రం గెస్ట్ హౌస్‌లో వైసీపీ నేతలతో రాజకీయ శిక్షణ ఇప్పించనున్నారు. ఆయా వార్డుల్లో ఓటర్ల నాడి తెలుసుకోవటం, విపక్షాల సానుభూతి పరుల వివరాలను తెలుసుకోవటం, ఇంకా ఎలాంటి సమాచారం సేకరించాలనే అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. రాబోయే ఎన్నికలను దృష్టి పెట్టుకుని శిక్షణ ఇవ్వనున్నారు.

Updated Date - Feb 07 , 2024 | 01:38 PM