Share News

Hyderabad: భార్యను హతమార్చి.. గోనె సంచిలో దాచిపెట్టి..

ABN , Publish Date - Jul 13 , 2024 | 10:54 AM

భార్యను హతమార్చి కుమార్తెతో కలిసి పరారైన సంఘటన ఉప్పల్‌ పోలీస్‏స్టేషన్‌(Uppal Police Station) పరిధిలోని న్యూభరత్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ప్రదీప్‌బోలా, మధుస్మిత దంపతులు.

Hyderabad: భార్యను హతమార్చి.. గోనె సంచిలో దాచిపెట్టి..

- కుమార్తెను తీసుకొని పరార్‌

- ఆలస్యంగా వెలుగులోకి..

హైదరాబాద్: భార్యను హతమార్చి కుమార్తెతో కలిసి పరారైన సంఘటన ఉప్పల్‌ పోలీస్‏స్టేషన్‌(Uppal Police Station) పరిధిలోని న్యూభరత్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ప్రదీప్‌బోలా, మధుస్మిత దంపతులు. వీరికి ఒక కుమార్తె. ఉప్పల్‌ న్యూభరత్‌నగర్‌(Uppal New Bharatnagar)లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రదీప్ బోలా స్థానికంగా ఓ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. ఆరు రోజులుగా హోటల్‌కు పోలేదు. హోటల్‌ నిర్వాహకులు అద్దె ఇంటి వద్దకు శుక్రవారం రాగా తాళం వేసి ఉంది.

ఇదికూడా చదవండి: Hydanabad: ట్రాన్స్‌జెండర్‌ దారుణహత్య..


గది నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు 100కు డయల్‌ చేశారు. దీంతో పోలీసులు గది తాళం పగలగొట్టి చూసే సరికి బాత్‌రూమ్‌లోని ఓ గోనె సంచిలో మృతదేహం లభించింది. ఇది మధుస్మితదిగా గుర్తించారు. ఐదారు రోజుల క్రితం ప్రదీప్‌ బోలానే గొంత నులిమి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్‌ టీమ్‌ నమూనాలను సేకరించారు. ఉప్పల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 13 , 2024 | 10:54 AM