Share News

Central Government : ధరల స్థిరీకరణకు 5 లక్షల టన్నుల ఉల్లి నిల్వ

ABN , Publish Date - Jun 23 , 2024 | 02:52 AM

ఉల్లి ధరలను స్థిరీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఏడాది 5 లక్షల టన్నుల ఉల్లిని సేకరించి బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇంతవరకు సుమారు 71వేల టన్నులను సేకరించింది.

 Central Government : ధరల స్థిరీకరణకు 5 లక్షల టన్నుల ఉల్లి నిల్వ

న్యూఢిల్లీ, జూన్‌ 22: ఉల్లి ధరలను స్థిరీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఏడాది 5 లక్షల టన్నుల ఉల్లిని సేకరించి బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇంతవరకు సుమారు 71వేల టన్నులను సేకరించింది. వినియోగదారుల విభాగం గణాంకాల ప్రకారం శుక్రవారం ఉల్లి రిటెయిల్‌ ధర కిలోకు రూ.38.67గా నమోదయింది.

మోడల్‌ ధర కిలోకు రూ.40గా ఉంది. కాగా, సేకరించిన ఉల్లిని మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఉల్లిని సేకరించేప్పుడు రైతులకు కూడా మార్కెట్‌ ధరనే చెల్లిస్తామన్నారు. వర్షాభావం వల్ల ఉల్లి ఉత్పత్తి తగ్గిందని, అందువల్లనే ప్రస్తుతం ధరలు పెరిగాయని వివరించారు.

Updated Date - Jun 23 , 2024 | 07:02 AM