Share News

Puri Jagannath Temple: తిరుపతి లడ్డూ వివాదం: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Sep 25 , 2024 | 02:44 PM

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. పూరీ జగన్నాథుడికి నైవధ్యంగా సమర్పించే పదార్థాల్లో వినియోగించే నెయ్యి నాణ్యతను పరీక్షించాలని నిర్ణయించింది.

Puri Jagannath Temple: తిరుపతి లడ్డూ వివాదం: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

ఒడిశా, సెప్టెంబర్ 25: తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. పూరీ జగన్నాథుడికి నైవధ్యంగా సమర్పించే పదార్థాల్లో వినియోగించే నెయ్యి నాణ్యతను పరీక్షించాలని నిర్ణయించింది. ఈ మేరకు పూరీ జిల్లా కలెక్టర్ సిద్దార్థ శంకర్ స్వైన్ బుధవారం పూరీలో వెల్లడించారు. 12 శాతాబ్దం నుంచి జగన్నాథుడికి వివిధ రూపాల్లో ప్రసాదాలు సమర్పిస్తున్నామని తెలిపారు.

Also Read: Jammu and Kashmir Elections: ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న విదేశీ దౌత్యవేత్తల బృందం'

Also Read: Gold and Silver Rates Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. వెండి రేటు మాత్రం..


అయితే ఏ నాడు విమర్శలు అయితే రాలేదన్నారు. జగన్నాథుడి ప్రసాదం తయారీలో ఒడిశా మిల్క్ ఫెడరేషన్ సంస్థ తయారు చేసిన నెయ్యినే వినియోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకే ఈ నెయ్యి నాణ్యతను పరీక్షించాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. గతంలో గుడి ఆవరణలో దీపాలు వెలిగించేందుకు కల్తీ నెయ్యి వినియోగించినట్లు గుర్తించామని జగన్నాథ స్వామి దేవాలయంలో విధులు నిర్వహిస్తున్న జగన్నాథ స్వైన్ మహాపాత్ర ఈ సందర్బంగా గుర్తు చేశారు. దీంతో ఆ నెయ్యి సరఫరాను దేవాలయ ఉన్నతాధికారులు నిలిపి వేశారన్నారు. భక్తుల విశ్వాసమే తమకు ముఖ్యమని ఈ సందర్భంగా మహాపాత్ర గుర్తు చేశారు.

Also Read: Jammu and Kashmir Assembly Elections: కొనసాగుతున్న రెండో విడత పోలింగ్

Also Read: Muhammad Yunus: షేక్ హసీనా ఆరోపణలు.. యూఎస్‌ అధ్యక్షుడు జో బైడెన్‌తో యూనస్ భేటీ


గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో వెంకన్న లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఎన్‌డీడీబీ నివేదిక వెల్లడించింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసిన విషయం విధితమే.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 25 , 2024 | 02:50 PM