Share News

Election Commission of India : మహారాష్ట్ర సీఎం శిందే లగేజీ తనిఖీ

ABN , Publish Date - May 17 , 2024 | 04:40 AM

ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి నగదు తరలిస్తున్నారనే ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే లగేజీని ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు.

Election Commission of India : మహారాష్ట్ర సీఎం శిందే లగేజీ తనిఖీ

నాసిక్‌: ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి నగదు తరలిస్తున్నారనే ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే లగేజీని ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. గురువారం మహారాష్ట్రలో నాసిక్‌ జిల్లా పంచవటి పర్యటనకు శిందే వచ్చినపుడు ఆయన వెంట తెచ్చుకున్న బ్యాగులను అధికారులు పరిశీలించారు. శిందే హెలికాప్టర్‌లో నగదు ఉన్న బ్యాగులు తీసుకుని నాసిక్‌ వచ్చారంటూ శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపించడంతో తనిఖీలు చేశారు.

Updated Date - May 17 , 2024 | 07:15 AM