Share News

Congress: చేవెళ్ల అభ్యర్థిగా రంజిత్‌రెడ్డి.. మల్కాజిగిరి నుంచి సునీతారెడ్డి..

ABN , Publish Date - Mar 20 , 2024 | 12:44 PM

చేవెళ్ల సీటును సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి(MP Ranjith Reddy)కి ఇవ్వాలని కాంగ్రెస్‌(Congress) పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది.

Congress: చేవెళ్ల అభ్యర్థిగా రంజిత్‌రెడ్డి.. మల్కాజిగిరి నుంచి సునీతారెడ్డి..

- మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఆఫర్‌?

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): చేవెళ్ల సీటును సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి(MP Ranjith Reddy)కి ఇవ్వాలని కాంగ్రెస్‌(Congress) పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ టికెట్‌ ఆశించిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి భార్య వికారాబాద్‌ జడ్పీచైర్‌పర్సన్‌ సునీతారెడ్డి(Vikarabad ZP Chairperson Sunitha Reddy)కి మల్కాజిగిరి టికెట్‌ ఖరారు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం జరిగే కేబినెట్‌ విస్తరణలో మహేందర్‌రెడ్డికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సునీతారెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలో దింపేందుకు మహేందర్‌రెడ్డి అంగీకరించినట్లు పార్టీవర్గాల ద్వారా తెలుస్తోంది.

Updated Date - Mar 20 , 2024 | 12:44 PM