Share News

Hyderabad: హైడ్రా లాంటి సంస్థను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:33 AM

హైదరాబాద్‌ మహా నగరంలో చెరువులు, కుంటల రక్షణ కోసం ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా)ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని తెలంగాణ ముదిరాజ్‌ మహా సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ జి.శ్రీను ముదిరాజ్‌ సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Hyderabad: హైడ్రా లాంటి సంస్థను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలి

- 40 వేలకు పైగా ఉన్న చెరువులు, కుంటలను రక్షించాలి

- తెలంగాణ ముదిరాజ్‌ మహా సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీను

హైదరాబాద్: హైదరాబాద్‌ మహా నగరంలో చెరువులు, కుంటల రక్షణ కోసం ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా)ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని తెలంగాణ ముదిరాజ్‌ మహా సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ జి.శ్రీను ముదిరాజ్‌ సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. హైడ్రాను ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy)కి, దానిని నడిపిస్తున్న కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరం, శివారు ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి అవుతున్నాయని, అందులో బహుళ అంతస్తుల భవనాలు, ఫామ్‌ హౌస్‌లు వెలిశాయని అన్నారు.

ఇదికూడా చదవండి: Arrest: ఐదుగురు సెల్‌ఫోన్‌ దొంగల అరెస్టు


చెరువులు, కుంటలను రక్షించడానికి, సహజ వనరులను కాపాడడానికి ప్రత్యేక అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఏర్పాటు చేసిన కొన్ని రోజుల్లోనే చెరువులు, కుంటల బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన పలు అక్రమ నిర్మాణాలను కూల్చి వేసిందని అన్నారు. సీఎం చొరవతో ఏర్పాటు అయిన హైడ్రాతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 లక్షల మంది మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేసి 40 వేల చెరువులను కాపాడాలని ఆయన సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫిషరీస్‌ కాంగ్రెస్‌ కమిటీ రాష్ట్ర అధికారప్రతినిధి గొడుగు శ్రీనివాస్‌ ముదిరాజ్‌, ఉప్పరవేని రంజిత్‌ ముదిరాజ్‌, ఎస్‌.మహేష్‌, పి.రాజు, తదితరులు పాల్గొన్నారు.

.


......................................................

ఇదికూడా చదవండి:

........................................................

Arrest: ఐదుగురు సెల్‌ఫోన్‌ దొంగల అరెస్టు

హైదరాబాద్: మధ్యరాత్రి నిర్మానుష్య ప్రదేశంలో ఒంటరిగా వెళుతున్న ప్రజల నుంచి సెల్‌ఫోన్లను(Cell phones) కాజేస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని గోపాలపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్‌ రాణిగంజ్‌కు చెందిన మహ్మద్‌ మస్తాన్‌(22) సికింద్రాబాద్‌(Secunderabad)కు చెందిన మహ్మద్‌ యాకుబ్‌ (23)లు కలిసి నేరాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బుతో సులువుగా డబ్బు సంపాదించి జల్సాలకు అలవాటుపడ్డారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, సంగీత్‌ చౌరస్తా, ముఖ్యమైన కూడళ్ల వద్ద మధ్యరాత్రి సమయంలో ఒంటరిగా డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఒంటరిగా ఉండడం చూసి వీళ్ల వద్దకు వెళ్లి సెల్‌ఫోన్‌లను లాక్కొని పారిపోతున్నారు.

city7.jpg


నిత్యం ప్రజల నుంచి వరుస ఫిర్యాదులు రావడంతో సికింద్రాబాద్‌లో మాటు వేసిన గోపాలపురం క్రైమ్‌ కానిస్టేబుళ్లు(Gopalapuram Crime Constables) నిందితులను ఎట్టకేలకు పట్టుకోగలిగారు. నిందితుల్లో మస్తాన్‌ టెంట్‌ హౌజ్‌లో పనిచేస్తూ గంజాయి విక్రయించేవాడు. నిందితుల్లో యాకుబ్‌ అనే వ్యక్తి హత్య కేసులు, చిన్న చిన్న కేసులు నేరాల్లో నిందితుల్లో ఉన్నారని విచారణలో వెల్లడైంది, సికింద్రాబాద్‌లో చోరీలకు పాల్పడిన సెల్‌ఫోన్లను ముషీరాబాద్‌కు చెందిన సయ్యద్‌ మస్తాన్‌కు తక్కువ ధరలకు విక్రయించేవారని పోలీసులు తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.


తుకారాంగేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో...

ఒంటరిగా కనిపించిన వ్యక్తుల నుంచి సెల్‌ఫోన్లను ఎత్తుకెళుతున్న ఇద్దరు నిందితులను తుకారాంగేట్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సీఐ శంకర్‌ నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన మాసమల్ల ప్రవీణ్‌ కుమార్‌ (25), కర్నాకటకు చెందిన హుగర్‌ బసవరాజు (55), ఇద్దరు సికింద్రాబాద్‌లో పరిచయమై స్నేహితులయ్యారు. తుకారాంగేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మధ్యరాత్రి సమయంలో ఇద్దరూ కలిసి తిరుగుతూ ఒంటరిగా సెల్‌ఫోన్‌ మాట్లాడుకుంటూ వెళుతున్న వ్యక్తుల్ని నుంచి సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లేవారు.


అనేక వరుస ఫిర్యాదులు రావడంతో తుకారాంగేట్‌ క్రైమ్‌ కానిస్టేబుళ్లు ఈ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని రాత్రి పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో ఇద్దరూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తే తుకారాంగేట్‌, గోపాలపురం, మారేడుపల్లి, కుషాయిగూడ, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో సెల్‌ఫోన్‌లను చోరీ చేసిన ఘటనలో అరెస్టు అయ్యారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 21 , 2024 | 11:33 AM