ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు ఊరట..

ABN, Publish Date - Aug 27 , 2024 | 02:18 PM

లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు సుప్రీంకోర్టు(Supreme Court) బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కవితకు ఈడీ కేసులో ఊరట లభించింది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కవితకు ఈడీ కేసులో ఊరట లభించింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు 20మంది ఢిల్లీకి చేరుకున్నారు. కవితకు బెయిల్ రావడంతో పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టులో ఈడీ, కవిత తరఫు న్యాయవాదులు హోరాహోరీ వాదనలు వినిపించారు. ముకుల్ రోహత్గి వినిపించిన వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. దీంతో లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఉత్కంఠకు తెరపడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలయ్య గుట్టకు పోటెత్తిన భక్తులు..

నేడు ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు

టీటీడీలో స్కామ్.. ఆ ముగ్గురిపై ఫిర్యాదులు..

హైడ్రా దూకుడు.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు...?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 27 , 2024 | 02:21 PM