YSRCP: కిడ్నాప్, హత్యాయత్నం కేసులో వైసీపీ కౌన్సిలర్ అరెస్ట్
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:48 AM
డబ్బుకోసం పట్టపగలే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి కారులో చిత్రహింసలు పెట్టిన కేసులో వైసీపీ కౌన్సిలర్, మరొక వ్యక్తిని పోలీసులు అరె్స్టచేశారు. ఈ నెల 5వ తేదీనగుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది.

ఈ నెల 5న తెనాలిలో వ్యక్తి అపహరణ, కారులోనే దాడి
బాధితుడి ఫిర్యాదుతో నలుగురిపై కేసు
తెనాలి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): డబ్బుకోసం పట్టపగలే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి కారులో చిత్రహింసలు పెట్టిన కేసులో వైసీపీ కౌన్సిలర్, మరొక వ్యక్తిని పోలీసులు అరె్స్టచేశారు. ఈ నెల 5వ తేదీనగుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. పోలీసులు బృందాలుగా ఏర్పడి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, వైసీపీకి చెందిన తెనాలి మున్సిపల్ కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్తో పాటు షేక్ రహమాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. తెనాలి త్రీటౌన్ సీఐ రమే్షబాబు కథనం మేరకు.. వైసీపీ కౌన్సిలర్ అహ్మద్బేగ్ ఈ నెల 5న వార్పురోడ్డులో పనిచేసుకుంటున్న కార్పెంటర్ షేక్ మస్తాన్ వలిని పట్టపగలే కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. తెనాలి నుంచి విజయవాడ వరకూ కారులోనే చితకబాదుతూ డబ్బులు డిమాండ్ చేశాడు.
విజయవాడలో చెన్నై నుంచి రావాల్సిన కీలక వ్యక్తి రాలేదన్న కారణంతో వారు డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వలేనన్న బాధితుడితో రూ.10 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుని తిరిగి తెనాలిలో వదిలిపెట్టారు. బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన తరువాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దీనిపై కేసు నమోదైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న అహ్మద్ బేగ్పై గతంలో రెండు కిడ్నాప్ కేసులున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు దౌర్జన్యాలకు పాల్పడడంతో అతనిపై రౌడీషీట్ కూడా తెరిచారు. శనివారం మొగల్ అహ్మద్, రహమాన్ తెనాలి వచ్చినట్టు సమాచారం అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు షేక్ ఇర్ఫాన్, షేక్ హుమయున్ క్రిస్టీ పరారీలో ఉన్నారని వీరిని కూడా అరెస్ట్ చేస్తామని సీఐ రమే్షబాబు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..
Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు
Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.