-
-
Home » Mukhyaamshalu » Today Breaking News In Telugu Live Updates Monday 24 th February 2025 Suri
-

Breaking News: గుంటూరు మిర్చి రైతులకు శుభవార్త..!
ABN , First Publish Date - Feb 24 , 2025 | 09:58 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-02-24T18:32:52+05:30
అమరావతి: గుంటూరు మిర్చి రైతులకు శుభవార్త..!
ఎక్స్ వేదికగా వెల్లడించిన కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.
భారత ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం(MIS) ద్వారా క్వింటాకు రూ.11,781 మద్దతు ధర నిర్ణయం.
25% ఉత్పత్తి కొనుగోలు, అవసరమైతే పెంపు అవకాశం.
రైతులకు ఇది కేవలం ఊరట కాదు – బలమైన అండ.
-
2025-02-24T18:27:53+05:30
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. పోలీసులు ఏం చేశారంటే..
అమరావతి: సీఎం చంద్రబాబుపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి కార్యకర్త అవుతు శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు.
శ్రీధర్ రెడ్డి మీద FIR నమోదు చేసిన విజయవాడ సూర్యరావుపేట పోలీసులు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త అవుతు శ్రీధర్ రెడ్డి.
ఐటీ యాక్ట్ 2008 ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.
సోషల్ మీడియా వేదికగా కించపరిచే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు.
సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారి మీద ఐటీ యాక్ట్ క్రింద కేసు నమోదు, రౌడీ షీట్లు పీడీ యాక్ట్ ప్రయోగం.
-
2025-02-24T16:24:57+05:30
పీఎం కిసాన్ నిధులు విడుదల...
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.
సోమవారం నాడు బీహార్లోని భాగల్పూర్లో పీఎం ఈ నిధులు విడుదల చేశారు.
19వ విడతలో భాగంగా రైతుల ఖాతాల్లో రూ. 2000 జమ చేశారు.
-
2025-02-24T16:22:22+05:30
టీడీపీ ఆఫీస్పై దాడి.. మరో ముగ్గురు అరెస్ట్..
కృష్ణా: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురు అరెస్టు.
నిందితులు ఏ27 శివకుమార్, ఏ28 ఆదిలక్ష్మి, ఏ54 ప్రవీణ్ అరెస్టు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నిందితులకు రిమాండ్ విధించిన జడ్జి.
-
2025-02-24T15:55:56+05:30
జగన్కు ఏపీ అసెంబ్లీ ఝలక్..
జగన్ మెడపై ఇంకా వేలాడుతున్న 60 రోజుల అనర్హత వేటు.
అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఈ రోజు సమావేశాలకు హజరు అయిన జగన్.
ఈ రోజు సమావేశం ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం మాత్రమే.
సోమవారం జరిగిన సెషన్ వర్కింగ్ డే కాదని తేల్చిన అసెంబ్లీ వర్గాలు.
పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం సమావేశాల ప్రారంభానికి ముందు జరిగే గవర్నర్ ప్రసంగం మాత్రమేనని చెబుతున్న అధికారులు.
సోమవారం జరిగిన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం కస్టమరీ సెషన్ అని పేర్కొన్న అధికారులు.
మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు సాంకేతికంగా ప్రారంభం కానున్నాయి.
అసెంబ్లీ సమావేశాలంటే స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాన్నే వర్కింగ్ డే గా పిలుస్తారంటున్న అధికారులు.
సోమవారం జరిగిన సెషన్కు హజరు అయిన అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసినా అవి పరిగణలోకి తీసుకోమంటున్న అధికారులు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4లో వరుసగా 60 రోజులు సభ్యుడు సమావేశాలకు హజరు కాకపోతే సీటు వేకెంట్ అనే డిక్లేర్ చేసే అధికారం స్పీకర్ దే.
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించిన వైసీపీ.
దీంతో జగన్ మెడపై వేలాడుతున్న 60 రోజుల గైర్హాజర్ అనర్హత కత్తి.
-
2025-02-24T14:05:01+05:30
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్యే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..
అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
ఏపీలో 5 ఖాళీలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది.
మార్చి 29తో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది.
మార్చి 3వ తేదీన ఈ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
మార్చి 10 నామినేషన్లకు తుది గడువు.
11వ తేదీన స్క్రూటీనీ ఉంటుంది.
13వ తేదీ వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం.
మార్చి 20వ తేదీన పోలింగ్ ఉంటుంది.
మార్చి 20వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు.
తెలంగాణలోనూ 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
-
2025-02-24T13:09:30+05:30
వైసీపీపై ఉపముఖ్యమంత్రి పవన్ హాట్ కామెంట్స్..
అమరావతి: అసెంబ్లీ ఆవరణలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడారు.
ఈ 5 ఏళ్ళు ప్రతిపక్ష హోదా తమకు రాదని వైసీపీ మానసికంగా ఫిక్స్ అయితే మంచిది.
గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు హేయం.
ప్రతిపక్ష హోదా అడిగి తెచ్చుకునేది కాదు, ప్రజలు ఇస్తే వచ్చేది.
జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వైసీపీకి వచ్చేది
సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని వైసీపీ గుర్తించాలి.
ఆరోగ్యం బాలేకపోయినా గవర్నర్ సభకు వచ్చి ప్రసంగిస్తే, వైసీపీ అడ్డుకోవాలనుకోవటం హేయం.
వైసీపీ హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
వైసీపీ నేతలు సభకు వస్తే, ఆ పార్టీకి ఉన్న బలం బట్టి ఎంత సమయం కేటాయించాలో కేటాయిస్తారు.
ఉదయం గవర్నర్ని ఆహ్వాహించేందుకు స్పీకర్ రమ్మని నన్ను కోరినా, ప్రోటోకాల్ బ్రేక్ చేయటం సరికాదని నేనే వెళ్ళలేదు.
ఓట్ల శాతం ప్రకారం తనకు ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లటం మంచిది.
-
2025-02-24T11:26:44+05:30
ఘోర ప్రమాదం.. తెలంగాణ వాసులు మృతి..
సంగారెడ్డి: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వారణాసి వద్ద ఘోర రోడ్డుప్రమాదం
కారు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వాసులు ముగ్గురు మృతి
కుంభమేళాకు వెళ్లొస్తుండగా ప్రమాదానికి గురైన కారు
ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి టిప్పర్ను కొట్టిన వాహనం
ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు
మృతులు జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి, భార్య విలాసిని, డ్రైవర్ మల్లారెడ్డిగా గుర్తింపు
వెంకటరామిరెడ్డి స్వగ్రామం న్యాల్కల్ మండలం మామిడ్గి
-
2025-02-24T11:07:55+05:30
వారి పాలనలో ఆర్థికంగా పతనం: గవర్నర్..
వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థిక పతనం అంచుకు చేరింది: అబ్దుల్ నజీర్
రాష్ట్రానికి జరిగిన నష్టంపై 7 శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలిపాం: గవర్నర్
వైసీపీ పాలనలో వనరుల మళ్లింపు, భారీగా సహజవనరుల దోపిడీ: అబ్దుల్ నజీర్
వైసీపీ పాలనలో రాష్ట్రం 25 ఏళ్ల ఆదాయాన్ని కోల్పోయింది: గవర్నర్
ఏపీలో సూర్య ఘర్ యోజన కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నాం: అబ్దుల్ నజీర్
మా ప్రభుత్వ చర్యలతో టూరిజంలో పెట్టుబడులు పెరిగాయి: గవర్నర్
MSMEలకు అండగా ఉన్నాం.. అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం: అబ్దుల్ నజీర్
యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నాం: గవర్నర్
-
2025-02-24T11:07:54+05:30
2027 నాటికి పోలవరం పూర్తి: గవర్నర్
ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం: గవర్నర్
మన బడి- మన భవిష్యత్తు ద్వారా స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం: అబ్దుల్ నజీర్
P-4 విధానం ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం: గవర్నర్
మెరిట్ ఆధారంగా 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించాం: అబ్దుల్ నజీర్
స్థానికసంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధన ఎత్తివేశాం: గవర్నర్
కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాం: గవర్నర్
ఐటీఐలు, పాలిటెక్నిక్ల్లో 200 స్కిల్ హబ్లు ఏర్పాటు: : అబ్దుల్ నజీర్
2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: గవర్నర్
పోలవరం- బనకచర్ల పూర్తయితే రాయలసీమలో కరవు ఉండదు: అబ్దుల్ నజీర్
ముగిసిన గవర్నర్ ప్రసంగం.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన గవర్నర్ అబ్దుల్ నజీర్
గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీని రేపటికి వాయిదా వేసిన స్పీకర్
-
2025-02-24T10:52:34+05:30
మ్యూజికల్ నైట్లకు ఎన్నికల కోడ్ వర్తించదా: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని అసెంబ్లీలో కోరాం: ఎమ్మెల్సీ బొత్స
ప్రతిపక్షమంటే ప్రజల పక్షం: ఎమ్మెల్సీ బొత్స
ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గవర్నర్ ప్రసంగంలో డిమాండ్ చేశాం: ఎమ్మెల్సీ బొత్స
సభలో ఉండేవి రెండే పక్షాలు.. కూటమిది అధికారపక్షం.. మేము ప్రతిపక్షం: ఎమ్మెల్సీ బొత్స
మిర్చి రైతులను ఆదుకోవాలని అసెంబ్లీ కోరాం: ఎమ్మెల్సీ బొత్స
గుంటూరు మిర్చియార్డును జగన్ మోహన్ రెడ్డి సందర్శించే వరకూ ఈ ప్రభుత్వంలో చలనం రాలేదు: ఎమ్మెల్సీ బొత్స
రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ బొత్స
రైతుల కోసం మాట్లాడితే మా నాయకుడిపై కేసులు పెడతారు: ఎమ్మెల్సీ బొత్స
రైతుల సమస్యలకు ఎన్నికల కోడ్ అడ్డొస్తుంది: ఎమ్మెల్సీ బొత్స
మ్యూజికల్ నైట్లకు ఎన్నికల కోడ్ వర్తించదా: ఎమ్మెల్సీ బొత్స
రైతుల సమస్యలు ప్రస్తావించాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి: ఎమ్మెల్సీ బొత్స
సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారు: ఎమ్మెల్సీ బొత్స
బాబు గ్యారంటీ అన్నారు.. అది గ్యారంటీ కాదు మోసం: ఎమ్మెల్సీ బొత్స
ప్రభుత్వం ప్రతిస్పందన చూసిన తర్వాతే మేము సభకు రావాలో లేదో చెప్తాం: ఎమ్మెల్సీ బొత్స
ప్రజా సమస్యలపై అన్ని రకాలుగా పోరాడుతాం: ఎమ్మెల్సీ బొత్స
-
2025-02-24T10:47:30+05:30
వైసీపీ నేతల ప్రెస్ మీట్..
అమరావతి: శాసనసభ ప్రారంభమైన 11 నిమిషాలపాటు సభలో ఉన్న జగన్, వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
గవర్నర్ ప్రసంగం మెుదలైన 11 నిమిషాలపాటు నినాదాలు చేసి అనంతరం సభ నుంచి వెళ్లిపోయిన జగన్
జగన్ వెంట అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
అసెంబ్లీ ప్రాంగణ బయట వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ నిర్వహణ
-
2025-02-24T10:37:14+05:30
2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం: గవర్నర్..
ఏపీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: గవర్నర్
ప్రతినెల ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తున్నాం: అబ్దుల్ నజీర్
పెన్షన్లు రూ.4వేలకు పెంచాం: గవర్నర్ అబ్దుల్ నజీర్
పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, విద్య, వైద్యం మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాం: గవర్నర్
బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం: అబ్దుల్ నజీర్
స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం: గవర్నర్
ఏడాదికి 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం: గవర్నర్
పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయేలా చేశాం: అబ్దుల్ నజీర్
అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఉండాలనేది మా ఆకాంక్ష: గవర్నర్
ప్రతి కుటుంబానికీ రక్షిత తాగునీరు, విద్యుత్ అందిస్తున్నాం: అబ్దుల్ నజీర్
ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది: గవర్నర్
సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం: అబ్దుల్ నజీర్
2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం: గవర్నర్
-
2025-02-24T10:25:37+05:30
అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం..
ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు: గవర్నర్
ప్రజలు కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది: అబ్దుల్ నజీర్
గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైంది: గవర్నర్
వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది: అబ్దుల్ నజీర్
సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం: గవర్నర్
అధికారంలోకి వచ్చిన వెంటనే ట్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం: అబ్దుల్ నజీర్
అన్నక్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నాం: గవర్నర్
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం: అబ్దుల్ నజీర్
మా ప్రభుత్వంలో తలసరి ఆదాయం పెరిగింది: గవర్నర్
అవకాశాలిస్తే ప్రతిఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని నమ్ముతున్నాం: అబ్దుల్ నజీర్
-
2025-02-24T10:20:52+05:30
శాసనసభ నుంచి వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు..
ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ శాసనసభలో గందరగోళం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్యేలు
కాసేపు నినాదాలు చేసిన అనంతరం సభ నుంచి బయటకు వెళ్లిపోయిన ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు
-
2025-02-24T10:05:59+05:30
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కూటమి, వైసీపీ ఎమ్మెల్యేలు
గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు
ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సభలో గందరగోళం చేస్తున్న వైసీపీ నేతలు
వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల నడుమ కొనసాగుతున్న గవర్నర్ ప్రసంగం
-
2025-02-24T09:58:11+05:30
మరికాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..
అమరావతి: కాసేపట్లో ప్రారంభంకానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడనున్న అసెంబ్లీ
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభకు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
అసెంబ్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి