Supreme Court: బుల్డోజర్ న్యాయం అమానవీయం
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:25 AM
ఉత్తరప్రదేశ్లో అక్రమ నిర్మాణాల పేరుతో ఇళ్లను కూల్చివేసిన చర్యపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులకు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ, ఈ చర్యను అమానవీయంగా పేర్కొంది

అంతరాత్మను కలచివేసేది
‘నిలువ నీడ’ ప్రాథమిక హక్కులో భాగం
అధికారుల చర్య దౌర్జన్యపూరితం
నోటీసులు రిజిస్టర్ పోస్టులో పంపాలి
బాధితులకు 10లక్షల చొప్పున పరిహారం
యూపీ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
బాధితులకు 10 లక్షల చొప్పున చెల్లించాలి: సుప్రీం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: అక్రమ నిర్మాణాల పేరుతో ఇళ్లను కూల్చివేస్తూ బుల్డోజర్ న్యాయం అమలు చేస్తున్నందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై మంగళవారం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టబద్ధంగా తగిన ప్రక్రియను పాటించకుండా ఇళ్లను కూల్చివేయడం ‘అమానవీయం, అక్రమం’ అని వ్యాఖ్యానించింది. ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఒక్కొక్కొరికి రూ.10 లక్షలు వంతున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ప్రయాగ్రాజ్లోని లుకేర్గంజ్లో ప్రయాగ్రాజ్ డెవల్పమెంట్ అథారిటీ (పీడీఏ) ఇళ్లను కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. ‘‘ఇలాంటి కేసులు మన అంతరాత్మను షాక్కు గురిచేస్తాయి. అధికారులు దౌర్జన్యపూరితంగా వ్యవహరించి నివాసాలను కూల్చి వేశారు. శిధిల భవనం వద్ద ఓ చిన్న బాలిక దీనంగా నిల్చొని ఉన్న వీడియో వైరల్గా మారింది. ఇలాంటి దృశ్యాలు కలచివేస్తాయి. నిలువ నీడను కలిగి ఉండే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో పొందుపరిచిన ప్రాథమిక హక్కులో అంతర్భాగం’’ అని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా, ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలయ్యే కొత్త వ్యాజ్యాలను స్వీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకే అంశంపై పలు విచారణలను అంగీకరించబోమని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి...
Husband Marries Wife to Lover: మళ్లీ మొదటి భర్త వద్దకు..
Horoscope 2025-2026: Horoscope 2025-2026: కొత్త సంవత్సరంలో మీ జాతక చక్రం ఎలా తిరగబోతుందో చూసుకోండి
Sri Rama Navami: Sri Rama Navami: శ్రీరామనవమి రోజు.. ఇలా చేయండి.. చాలు
Bengaluru Teacher: విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం.. టీచర్ అరెస్ట్
For Latest National News , National News in Telugu