శ్రీకాకుళంలో ఆంధ్రజ్యోతి లక్కీ డ్రా
ABN, Publish Date - Mar 25 , 2025 | 05:33 PM
శ్రీకాకుళం జిల్లాలోని ఆంధ్రజ్యోతి యూనిట్ కార్యాలయంలో కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీ వెంకటరమణ, డీఎస్పీ వివేకానందా హాజరయ్యారు. పోలీస్ అధికారులతో పాటు ఆంధ్రజ్యోతి పాఠకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవ పురస్కారం నేపథ్యంలో శ్రీకాకుళంలోని ఆంధ్రజ్యోతి యూనిట్ కార్యాలయంలో కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీ వెంకటరమణ, డీఎస్పీ వివేకానందా హాజరయ్యారు. పోలీస్ అధికారులతో పాటు ఆంధ్రజ్యోతి పాఠకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి యాజమాన్యం పాఠకుల కోసం ‘కార్ అండ్ బైక్ రేస్’ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.

విజేతల ఎంపిక కోసం మంగళవారం లక్కీ డ్రా తీశారు.

ఈ లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా బైక్ను విజయనగరానికి చెందిన బళ్ల రామకృష్ణ సొంతం చేసుకున్నారు. బొబ్బిలికి చెందిన లంక కుమారి ద్వితీయ బహుమతిగా రిఫ్రిజిరేటర్ దక్కించుకున్నారు. ఆముదాల వలసకు చెందిన లలితా కుమారి మూడో బహుమతిగా టీవీ లభించింది.

మరో వందమంది పాఠకులకు కన్సోలేషన్ బహుమతులు అందించారు.

విజేతలకు అతిథులు శుభాకాంక్షలు తెలిపారు.

నిత్యం పాఠకుల ఆదరాభిమానాలను పొందుతున్న ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని ఎస్పీతో పాటు ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.

అలాగే త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి లక్కీడ్రాలో బంపర్ బహుమతిగా కారు గెలుచుకునే అవకాశం ఉంది.
Updated at - Mar 25 , 2025 | 05:33 PM