Peetala Sujatha: ఆ మంత్రుల కమిటీ ఎందుకూ పనికిరాదు..
ABN , First Publish Date - 2022-11-14T13:47:13+05:30 IST
వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పీతల సుజాత (Peetala Sujatha) విమర్శలు చేశారు.

ప.గో. జిల్లా (West Godavari): వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పీతల సుజాత (Peetala Sujatha) విమర్శలు చేశారు. సోమవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అక్వా సమస్యల పరిష్కారానికి నియమించిన ముగ్గురు మంత్రుల కమిటీ ఎందుకూ పనికి రాదన్నారు. అక్వా రంగంపై అవగాహన లేని వారిని కమిటీ సభ్యులుగా నియమించారని విమర్శించారు. ఆ కమిటీ నివేదికల వల్లే అక్వా రైతులు నష్టపోయారన్నారు. మళ్ళీ చంద్రబాబు (Chandrababu) వల్లే అక్వా రైతులకు మేలు కలుగుతుందని పీతల సుజాత వ్యాఖ్యానించారు.