Chandrababu Naidu: బెంగుళూరు చేరుకున్న చంద్రబాబు.. నేతల ఘనస్వాగతం

ABN , First Publish Date - 2023-06-14T14:34:50+05:30 IST

కుప్పం పర్యటనలో భాగంగా టీపీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెంగుళూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కుప్పం టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ఘన స్వాగతం తెలిపారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా బెంగళూరులోని తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. శంకర్ యాదవ్ కుమార్తె వివాహం వివాహంలో పాల్గొని అక్కడి నుంచి కుప్పం చేరుకోనున్నారు.

Chandrababu Naidu: బెంగుళూరు చేరుకున్న చంద్రబాబు.. నేతల ఘనస్వాగతం

చిత్తూరు: కుప్పం పర్యటనలో భాగంగా టీపీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) బెంగుళూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కుప్పం టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ఘన స్వాగతం తెలిపారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా బెంగళూరులోని తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. శంకర్ యాదవ్ కుమార్తె వివాహం వివాహంలో పాల్గొని అక్కడి నుంచి కుప్పం చేరుకోనున్నారు. కోలార్, కేజీఎఫ్, బంగారంపేట్, కేoపపురం ఆంధ్ర సరిహద్దులోని రాళ్ళ బూదుగురుకు చంద్రబాబు చేరుకోనున్నారు. సాయంత్రం మూడున్నర గంటలకు కుప్పంలోని బీసీఎన్ కళ్యాణ మండపానికి చేరుకుని నాయకులు కార్యకర్తలతో అధినేత సమావేశం అవుతారు. కుప్పంలో బీసీఎన్ కళ్యాణ మండపంలో సాయంత్రం 4:30 గంటలకు టీడీపీ శ్రేణులతో జరుగనున్న సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. నేటి నుంచి మూడు రోజులు కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగనుంది. టీడీపీ నేతలతో సమావేశం అనంతరం రాత్రికి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేయనున్నారు. చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనకు కుప్పం టీడీపీ శ్రేణులు సర్వం సిద్ధం చేశారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-06-14T14:34:50+05:30 IST