AP Students: విశాఖ చేరుకున్న మణిపూర్‌లో చదువుతున్న ఏపీ విద్యార్థులు

ABN , First Publish Date - 2023-05-09T09:41:55+05:30 IST

మణిపూర్‌లో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో అక్కడ చదువుతున్న ఏపీ విద్యార్థులను తరలించేందుకు సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

AP Students: విశాఖ చేరుకున్న మణిపూర్‌లో చదువుతున్న ఏపీ విద్యార్థులు

విశాఖపట్నం: మణిపూర్‌లో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో అక్కడ చదువుతున్న ఏపీ విద్యార్థులను తరలించేందుకు సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వెను వెంటనే ఏపీ విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న మణిపూర్‌లో చదువుతున్న ఉత్తరాంధ్ర విద్యార్థులు ఈరోజు ఉదయం విశాఖకు చేరుకున్నారు. ద్వారకా స్టేషన్‌కు రెండు బస్సుల ద్వారా విద్యార్థులు చేరుకున్నారు. సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులు, బంధువులు రిసీవ్ చేసుకున్నారు. క్షేమంగా వారు పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ద్వారకా స్టేషన్ నుంచి ఉత్తరాంధ్రలో వారి స్వస్థలాలకు సురక్షితంగా వెళ్లడానికి ఆర్టీసీ అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఇంఫాల్ నుండి హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో వచ్చి అక్కడి నుంచి ఈరోజు ఉదయం విద్యార్థులు విశాఖకు చేరుకున్నారు.

మరోవైపు ఇప్పటి వరకు ఏపీకి చెందిన 163 మందిని ఏపీ ప్రభుత్వం మణిపూర్ నుంచి హైదరాబాద్ ద్వారా ఆంధ్రాకు తరలించారు. నిన్న అర్థరాత్రి వరకు ఇంపాల్ నుంచి హైదరాబాద్‌కు 108 మంది విద్యార్థులను తీసుకువచ్చారు. నిన్న రాత్రి పొద్దుపోయాక 55 మంది విద్యార్థులు హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 163 మందిని తరలించినట్టు ఏపీ ప్రభుత్వ వెల్లడించింది.

Updated Date - 2023-05-09T09:45:27+05:30 IST