TS NEWS: ల్యాంకోహిల్స్‌ భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య.

ABN , First Publish Date - 2023-08-12T18:33:47+05:30 IST

నగరంలో విషాదం జరిగింది. భవనం పై నుంచి ఓ యువతి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈసంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్(Rayadurgam Police Station) పరిధిలో చోటుచేసుకుంది.

TS NEWS: ల్యాంకోహిల్స్‌ భవనంపై నుంచి దూకి  యువతి ఆత్మహత్య.

హైదరాబాద్(Hyderabad): నగరంలో విషాదం జరిగింది. భవనంపై నుంచి ఓ యువతి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్(
Rayadurgam Police Station) పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మణికొండ ల్యాంకోహిల్స్‌(Manikonda Lancohills)లో నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి 21వ అంతస్తు పై నుంచి బిందుశ్రీ(28) అనే యువతి కిందకు దూకింది. దీంతో తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే మృతిచెందింది. ల్యాంకోహిల్స్‌ 15 LH బ్లాకులో గల పూర్ణ చందర్‌రావు ఇంట్లో చిల్డ్రన్ కేర్ టేకర్‌గా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బిందు శ్రీ పనిచేస్తోంది. కాగా యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌(Osmania Hospital)కు తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-08-12T18:44:16+05:30 IST