Share News

Piyush Goyal : కుటుంబ పాలనను అంతమొందిచాల్సిన సమయం వచ్చింది

ABN , First Publish Date - 2023-10-17T21:18:19+05:30 IST

కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందిచాల్సిన సమయం వచ్చిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal ) అన్నారు.

Piyush Goyal :  కుటుంబ పాలనను అంతమొందిచాల్సిన సమయం వచ్చింది

హైదరాబాద్: కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందిచాల్సిన సమయం వచ్చిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal ) అన్నారు. మంగళవారం నాడు జూబ్లీహిల్స్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ పాలనలోని పది సంవత్సరాల్లో తెలంగాణ పరిపాలనలో వెనక్కి పోయింది. రైతులు వారి కుటుంబం బాగుపడాలి అంటే బీజేపీతోనే సాధ్యం. బీఆర్ఎస్ పార్టీ అనేక హామీలు ఇస్తుంది.. ఒక్కటి కూడా నెరవేర్చదు. కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షా పేపర్లు కూడా లీకవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి. కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవినీతి కాంగ్రెస్‌ని తెలంగాణ ప్రజలు విశ్వసించరు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకీ బాధ్యత మాది. తెలంగాణ యువత దేశ వ్యాప్తంగా ఐటీ రంగంలో దూసుకుపోతుంది’’ అని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-17T21:18:19+05:30 IST