Share News

FOOTBALL : జాతీయ స్థాయి మహిళా పుట్‌బాల్‌ టోర్నీ

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:24 AM

సీనియర్‌ మహిళల జాతీయ స్థాయి పుట్‌బాల్‌ రాజామాత జీజాబాయి ట్రోఫీ పోటీలు ప్రారంభ మయ్యాయి. స్థానిక ఆర్డీటీ స్టేడియంలో శనివారం రాజామాత జీజీబాయి సీనియర్‌ మహిళల జాతీయస్థాయి పుట్‌బాల్‌ పోటీలను ఏపీ పుట్‌బాల్‌ అసోసియేషన జనరల్‌ సెక్రటరీ డేనియల్‌ ప్రదీప్‌ ప్రారంభించారు.

FOOTBALL : జాతీయ స్థాయి మహిళా పుట్‌బాల్‌ టోర్నీ
Athletes and members at the opening ceremony of the competition

ఒడిషా, అరుణాచల్‌ప్రదేశ జట్ల శుభారంభం

అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ మహిళల జాతీయ స్థాయి పుట్‌బాల్‌ రాజామాత జీజాబాయి ట్రోఫీ పోటీలు ప్రారంభ మయ్యాయి. స్థానిక ఆర్డీటీ స్టేడియంలో శనివారం రాజామాత జీజీబాయి సీనియర్‌ మహిళల జాతీయస్థాయి పుట్‌బాల్‌ పోటీలను ఏపీ పుట్‌బాల్‌ అసోసియేషన జనరల్‌ సెక్రటరీ డేనియల్‌ ప్రదీప్‌ ప్రారంభించారు. ఒడిషా, లడఖ్‌, మధ్యప్రదేశ, అరుణాచల్‌ ప్రదేశ జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్న పుట్‌బాల్‌ మహిళల పోటీలు ఈ నెల 23వతేదీ వరకు జరుగుతాయన్నారు. మొదటి మ్యాచలో లడఖ్‌పై ఏడు పాయింట్ల తేడాతో ఒడిషా విజయం సాధించింది. మరో మ్యాచలో అరుణాచల్‌ ప్రదేశ చేతిలో మధ్యప్రదేశ ఎనిమిది పాయింట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఒడిషా, అరుణాచల్‌ ప్రదేశ జట్లు విజయం సాధించి శుభారంభాన్ని అందుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా పుట్‌బాల్‌ అసోసియేషన జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌, నాగరాజు, కోఆర్డినేటర్‌ దాదాకలందర్‌, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 20 , 2024 | 12:24 AM