Share News

AP News: రాఫ్ట్ ఫౌండేషన్‌ను పరిశీలిస్తున్న చెన్నై బృందం

ABN , Publish Date - Aug 03 , 2024 | 12:39 PM

సచివాలయం హెచ్ఓడి టవర్స్‌ ప్రాంతంలో రాఫ్ట్ ఫౌండేషన్ ను చెన్నై బృందం పరిశీలిస్తోంది. మధ్యాహ్నం హైకోర్టు భవన నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించనుంది. గడచిన ఐదేళ్లుగా రాఫ్ట్ ఫౌండేషన్ నీళ్లలోనే నానుతోంది

AP News: రాఫ్ట్ ఫౌండేషన్‌ను పరిశీలిస్తున్న చెన్నై బృందం

అమరావతి: సచివాలయం హెచ్ఓడి టవర్స్‌ ప్రాంతంలో రాఫ్ట్ ఫౌండేషన్ ను చెన్నై బృందం పరిశీలిస్తోంది. మధ్యాహ్నం హైకోర్టు భవన నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించనుంది. గడచిన ఐదేళ్లుగా రాఫ్ట్ ఫౌండేషన్ నీళ్లలోనే నానుతోంది. ఆయా నిర్మాణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి నిర్మాణాల కొనసాగింపు పై నివేదికను చెన్నై ఐఐటి బృందం తయారు చేయనుంది. ఇప్పటికే రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను హైదరాబాద్ ఐఐటి బృందం పరిశీలించింది. మెహర్ ప్రసాద్ చెన్నై ఐఐటి స్ట్రక్చరర్ ఇంజనీర్ ఆధ్వర్యంలో హెచ్‌ఓడీ సచివాలయ రాఫ్ట్ ఫౌండేషన్ పటిష్టతను బృందం పరిశీలిస్తోంది.


ఈ బృందంలో కరోసన్ నిపుణులు రాధాకృష్ణ పిల్లైతో పాటు సాయిల్ అండ్ ఫౌండేషన్ ఎక్స్ పర్ట్ శుభదీప్ బెనర్జీ ఉన్నారు. ఎస్‌డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బోటులో వెళ్లి మరీ నిపుణుల బృందం పరిశీలన చేస్తోంది. 2019 కు ముందు నిర్మాణాలు కొన్ని ప్రారంభ దశలోనే ఉండగా.. కొన్ని ఫౌండేషన్ పూర్తి చేసుకున్నాయి. మరికొన్ని మధ్యలోనే నిలిచిపోయాయి. ఫౌండేషన్ దశలో నిలిచిపోయిన సెక్రటేరియట్, శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలకు సంబంధించి పునాదుల సామర్ధ్యాన్ని పరిశీలించే బాధ్యతను ప్రభుత్వం ఐఐటీ మద్రాస్‌కు అప్పగించారు.


ఇక ఐఏఎస్‌ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్‌ ఐఐటీకి అప్పగించింది. వీరు రెండు రోజుల పాటు అమరావతిలో పర్యటించి ఆయా కట్టడాలను పరిశీలించి వాటి నాణ్యత, సామర్థ్యాన్ని అంచనా వేయనున్నాయి. మొత్తానికి నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు చకచకా సాగేందుకు సర్వం సిద్ధమవుతోంది. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం రాజధాని పరిధిలో ‘నవ నగరాల’ నిర్మాణం జరగనుంది. సీఆర్డీయే పరిధిని యథాతథంగా కొనసాగించాలని కొత్త సర్కారు నిర్ణయించింది.

Updated Date - Aug 03 , 2024 | 12:39 PM