Share News

Road Accident: రెండు వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరి మృతి..

ABN , Publish Date - Sep 26 , 2024 | 07:15 AM

చిత్తూరు జిల్లా, బంగారు పాళ్యం మండలం, చిత్తూరు- బెంగుళూరు జాతీయ రహదారి మొగిలి ఘాట్లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళుతూ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒక లారీకి మంటలంటుకుని ఖాళీ బూడిద అయింది.

Road Accident: రెండు వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరి మృతి..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో రెండు వేర్వేరు జిల్లాల్లో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు (Road Accidents) జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి (Two died) చెందగా.. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు (Police) సంఘటన ప్రదేశాలకు చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. క్షతగాత్రులను సమీపం ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


చిత్తూరు జిల్లా, బంగారు పాళ్యం మండలం, చిత్తూరు- బెంగుళూరు జాతీయ రహదారి మొగిలి ఘాట్లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళుతూ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒక లారీకి మంటలంటుకుని ఖాళీ బూడిద అయింది. అందులోని డ్రైవరు సజీవ దహనం అయ్యాడు. మరో డ్రైవర్ లారీలోనే ఇరుక్కున్నాడు. కట్టెల లోడుతో వెళుతున్న లారీ మంటలకు ఆహుతయింది. చక్కర లోడుతో వెళ్తున్న లారీ తునాతునకులైంది. అందులో ఇరుక్కున్న డ్రైవర్ మృతి చెందాడు. ఇద్దరు క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.


సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. జేసీబీ యంత్రాల సహాయంతో చక్కెర లారీలో ఇరుక్కుని మృతి చెందిన డ్రైవర్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా మొగిలి ఘాట్ రోడ్డు తరచూ ప్రమాదాలకు నిలయంగా మారింది. 15 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఆర్టీసీ బస్సును భారీ కంటైనర్ లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే ఇవాళ మరో రోడ్డు ప్రమాదం జరిగింది. తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


రెండోది.. ఉమ్మడి నెల్లూరు జిల్లా, పెళ్లకూరు మండలం, చిల్లకూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్‌ మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాళహస్తి నుంచి నాయుడుపేటకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు ఎన్టీఆర్‌ జిల్లా వెంకటాపురం వాసిగా గుర్తించారు. క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మక్కెలు విరగ్గొడతాం

పెళ్లి పేరుతో రేప్‌.. హత్య..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 26 , 2024 | 08:24 AM