Crime News: బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి దారుణ హత్య..
ABN , Publish Date - Jun 26 , 2024 | 09:27 PM
పమిడిముక్కల మండలం లంకపల్లి(Lankapally) గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంగారు ఆభరణాల(Gold Jewellery) కోసం దుండగులు వృద్ధురాలిని హత్య చేశారు. గ్రామానికి చెందిన జ్యోతికృష్ణ(60) అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఇది గమనించిన దొంగలు ఆమె ఇంట్లో చోరీకి యత్నించారు.
![Crime News: బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి దారుణ హత్య..](https://media.andhrajyothy.com/media/2024/20240625/Murder_3ec319e7a0_v_jpg.webp)
కృష్ణాజిల్లా: పమిడిముక్కల మండలం లంకపల్లి(Lankapally) గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంగారు ఆభరణాల (Gold Jewellery) కోసం దుండగులు వృద్ధురాలిని హత్య చేశారు. గ్రామానికి చెందిన జ్యోతికృష్ణ(60) అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఇది గమనించిన దొంగలు ఆమె ఇంట్లో చోరీకి యత్నించారు. జ్యోతికృష్ణను తీవ్రంగా గాయపరిచి బంగారు గాజులు, 12సవర్ల గొలుసు ఎత్తుకెళ్లారు.
రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధురాలిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసిన పమిడిముక్కల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగలు దాడి చేసి దోపిడీ చేయడంపై స్థానికులు భయాందోళలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఇది కూడా చదవండి:
AP High Court: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి: ఏపీ హైకోర్టు..
Collector Srinivasulu: చిరుతపులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ శ్రీనివాసులు