Share News

సీఎం సహాయ నిధికి విరాళం

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:24 AM

వరద బాధితులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉమ్మడి కర్నూలు జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా పీడీ నాగశివలీల, మెప్మా కార్యాలయ సిబ్బంది తరపున విరాళంగా రూ.13,80,100 చెక్కును కలెక్టర్‌ రంజితబాషాకు అం దజేశారు.

సీఎం సహాయ నిధికి విరాళం
కలెక్టర్‌కు చెక్కును అందజేస్తున్న మెప్మా అధికారులు, సిబ్బంది

కర్నూలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 11: వరద బాధితులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉమ్మడి కర్నూలు జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా పీడీ నాగశివలీల, మెప్మా కార్యాలయ సిబ్బంది తరపున విరాళంగా రూ.13,80,100 చెక్కును కలెక్టర్‌ రంజితబాషాకు అం దజేశారు. సీఎం సహాయ నిధికి చెక్కును అందజేసిన వారిని కలెక్టర్‌ అభినం దించారు. టీపీఆర్వో వెంకటలక్ష్మి, ఏవో మాసూంబాషా, మురళి పాల్గొన్నారు.

ఫ సీఎం సహాయ నిధికి బెంగళూరు వహీద్‌ గ్రూపు ఎఫ్‌ఎం డెవలప్మెంట్‌ సొసైటీ వైస్‌ ప్రెసిడెంటు షేక్‌ వహీద్‌ రూ.50వేల చెక్కును కలెక్టర్‌ పి.రంజిత బాషాకు అందజేశారు.

కర్నూలు(న్యూసిటీ): ఆన ఇండియా బీఎస్‌ ఎనఎల్‌ డాట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన జిల్లా శాఖ ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధికి రూ.లక్ష విరాళం అందజేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు యాకోబు ఒక ప్రకటనలో తెలిపారు. అసో సియేషన కేంద్ర శాఖ ఢిల్లీ, ఏపీ విజయవాడ శాఖల విజ్ఞప్తి మేరకు ఉద్యో గుల నుంచి సేకరించిన విరాళాలను రాష్ట్ర కార్యదర్శికి అందజేశామన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:24 AM