Share News

Jagan: జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు..

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:57 PM

సీఎం జగన్ ను కలిసి పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు సీఎం జగన్‌ను కలిశామని తెలిపారు.

Jagan: జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు..

అమరావతి: సీఎం జగన్ ను కలిసి పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు సీఎం జగన్‌ను కలిశామని తెలిపారు. సీఎంను కనకదుర్గమ్మ ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సీఎంగా జగన్ గెలవాలన్నారు. 2024లో సీఎం జగన్‌కు మరింత బలం చేకూరాలని కోరుకుంటున్నామని వెల్లంపల్లి పేర్కొన్నారు.

విజయవాడ ఈస్ట్ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ఎంతమంది శత్రువులు ఎదురైనా సీఎం జగన్ సంక్షేమంలో వెనకడుగు వేయడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంతమంది ఏకమైనా మళ్లీ సీఎంగా జగన్ గెలుస్తారన్నారు.

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాదివిష్ణు మాట్లాడుతూ.. సీఎంగా జగన్ సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల కన్నా సంకల్ప బలం ఎక్కువగా ఉన్న వ్యక్తి జగన్ అని కొనియాడారు. పేదల కోసం ప్రతి నిత్యం కష్టపడుతున్న ఏకైక వ్యక్తి అని పేర్కొన్నారు. 175 సీట్లు టార్గెట్ గా ప్రజల ఆశీర్వాదం ఉంటుందన్నారు. దుష్ప్రచారం ఎజెండాగా ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 12:57 PM