Share News

Pawan Kalyan: మరికొన్ని గంటల్లో అసెంబ్లీలో అడుగిడనున్న పవన్

ABN , Publish Date - Jun 20 , 2024 | 10:12 AM

వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు పవన్ క్యాంపు కార్యాలయానికి రానున్నారు. పలు శాఖల అధికారులతో అంశాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు.

Pawan Kalyan: మరికొన్ని గంటల్లో అసెంబ్లీలో అడుగిడనున్న పవన్

అమరావతి: వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు పవన్ క్యాంపు కార్యాలయానికి రానున్నారు. పలు శాఖల అధికారులతో అంశాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ సంబంధించిన అధికారులతో పంచాయతీ నిధులతో పాటు ప్రస్తుత పంచాయతీ పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఎన్ఆర్జీఎస్ నిధుల ఆలస్యంపై పవన్ ఆరా తీయనున్నారు.


గ్రామీణ ప్రాంతాలలో ఉపాధిహామీ పనుల పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయాన్ని ఆయా శాఖల అధికారులను అడిగి పవన్ కల్యాణ్ తెలుసుకోనున్నారు. భవిష్యత్తు కార్యాచరణ పై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం వరకూ క్యాంపు కార్యాలయంలోనే ఆయన ఉండనున్నారు. రేపు తొలిసారిగా పవన్ అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. ఈ క్రమంలోనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ క్షణం కోసమే జనసైనికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Updated Date - Jun 20 , 2024 | 11:33 AM