Share News

Economic Survey: ఆర్థిక సర్వే ప్రత్యేకత ఏంటి.. బడ్జెట్‌కు ఒకరోజు ముందే ఎందుకు సమర్పిస్తారు?

ABN , Publish Date - Jul 21 , 2024 | 09:44 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) జులై 23న కేంద్ర బడ్జెట్‌ను (budget 2024) సమర్పించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(modi) నేతృత్వంలోని ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్పించనున్న తొలి బడ్జెట్‌ ఇదే. బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. అయితే అసలు ఆర్థిక సర్వేకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

 Economic Survey: ఆర్థిక సర్వే ప్రత్యేకత ఏంటి.. బడ్జెట్‌కు ఒకరోజు ముందే ఎందుకు సమర్పిస్తారు?
economic survey

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) జులై 23న కేంద్ర బడ్జెట్‌ను (budget 2024) సమర్పించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(modi) నేతృత్వంలోని ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్పించనున్న తొలి బడ్జెట్‌ ఇదే. బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను(Economic Survey) సమర్పించనున్నారు. బడ్జెట్ సంప్రదాయంలో ఇది ఒక ముఖ్యమైన భాగం. ఇది గత ఆర్థిక సంవత్సరం పూర్తి ఖాతాలను కలిగి ఉంటుంది. ముందున్న సవాళ్లను కూడా ఇది ప్రస్తావిస్తుంది. ఆర్థిక సర్వే ప్రభుత్వ రిపోర్ట్ కార్డ్ లాగా అర్థం చేసుకోవచ్చు. అయితే అసలు ఆర్థిక సర్వేకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం.


ఆర్థిక సర్వేలో ప్రత్యేకత ఏంటి?

ఆర్థిక సర్వే(Economic Survey) దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి చిత్రాన్ని అందిస్తుంది. ఇది ఆర్థిక స్థితి, అవకాశాలు, విధానపరమైన సవాళ్లు వంటి పలు అంశాలకు సంబంధించి వివరణాత్మకతను కలిగి ఉంది. ఆర్థిక సర్వే గత ఆర్థిక సంవత్సరం ఉపాధి, GDP, ద్రవ్యోల్బణం, బడ్జెట్ లోటు గురించి సమాచారాన్ని అందించే చాలా ముఖ్యమైన డేటాను కలిగి ఉంటుంది. సమగ్ర విశ్లేషణ కూడా అందిస్తారు. ఈసారి ఆర్థిక సర్వేను చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత్ నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం సిద్ధం చేసింది. భారతదేశ మొదటి ఆర్థిక సర్వే 1950-51లో సమర్పించబడగా, ఈసారి జులై 22న ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.


ఆర్థిక సర్వే ఎందుకు ముఖ్యం?

ఆర్థిక సర్వే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలను అందించడమే కాకుండా రాబోయే సవాళ్ల గురించి కూడా సూచనలు చేస్తుంది. దేశ ప్రగతికి ఆటంకం కలిగించే అంశాలు ఏంటో ప్రస్తావిస్తుంది. అయితే వాటిని తొలగించాలంటే ఏం చేయాలి? ఆర్థిక వ్యవస్థ వేగాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ఆర్థిక సర్వే చెబుతోంది. వ్యవసాయం లేదా ఆటోమొబైల్ వంటి వివిధ రంగాల సవాళ్లు, అవకాశాలను కూడా ఇది ప్రస్తావిస్తుంది.


మొదట బడ్జెట్‌లో భాగం

దేశ మొదటి ఆర్థిక సర్వే 1950-51లో సమర్పించబడింది. అప్పట్లో అది బడ్జెట్‌లో భాగం. కానీ 1964 నుంచి బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను సమర్పించే సంప్రదాయం ప్రారంభమైంది. దీంతో బ‌డ్జెట్‌కు ముందే ఆర్థిక వ్యవస్థ ప‌రిస్థితిని ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను సమర్పించలేదు. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ గురించి సంక్షిప్త సమాచారం ఇచ్చింది. ఇప్పుడు రానున్న పూర్తి బడ్జెట్ కంటే ముందే ఆర్థిక సర్వేను సమర్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.


సామాన్యులకు కూడా అవసరం

దేశ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సామాన్యులకు కూడా ఆర్థిక సర్వే సహాయపడుతుంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి ముఖ్యమైన గణాంకాల గురించి దీని ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. ఇది మన పెట్టుబడులు, పొదుపు, ఖర్చులను నిర్ణయించడం వంటి నిర్ణయాలు తీసుకోవడంలో దోహదం చేస్తుంది. ఆర్థిక సర్వేలో ప్రభుత్వ విధానాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. దీని ద్వారా ప్రభుత్వం ఏ విధానాన్ని అమలు చేస్తోంది, దాని ప్రభావం ఎలా ఉంటుందో ప్రజలకు(common people) అర్థమవుతుంది.


పెట్టుబడిదారులకు

ఆర్థిక సర్వేలో సామాజిక, ఆర్థిక సమస్యల గురించి సవివరమైన సమాచారం ఉంటుంది. వాటిని ఎదుర్కోవడానికి సూచనలు కూడా ఉంటాయి. అందువల్ల సాధారణ ప్రజానీకానికి అందుకు సంబంధించిన సమస్యలు సులభంగా అర్థమవుతాయి. ఆయా రంగాల్లో వారి పాత్ర ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సర్వే పెట్టుబడిదారులకు కూడా చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఈ సర్వేను బట్టి ఏయే ప్రాంతాల్లో మంచి పెట్టుబడి అవకాశాలు ఉన్నాయో అర్థం చేసుకోవడం వారికి సులువుగా ఉంటుంది. ఉదాహరణకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తే, ఈ రంగం పెట్టుబడికి మంచిదని చెప్పవచ్చు.


ఇవి కూడా చదవండి:

Budget 2024: బడ్జెట్‌ 2024 నేపథ్యంలో పెరగనున్న స్టాక్స్ ఇవే..!


గూగుల్‌ క్లౌడ్‌తో ఎల్‌4జీ జట్టు

Read More Business News and Latest Telugu News

Updated Date - Jul 21 , 2024 | 09:46 AM